
సింగూరుకు జలకళ
పుల్కల్(అందోల్): సింగూరు ప్రాజెక్టుకు రోజు రోజుకు వరద ప్రవాహం పెరుగుతోంది. డ్యాంకు ఎగువ భాగం మహారాష్ట్రలోని లాతూర్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో పక్షం రోజుల నుంచి డ్యాంలోకి నీటి ప్రవాహం పెరుగుతోంది. మే 30 నుంచి ఇప్పటివరకు డ్యాంలోకి మూడు టీఎంసీల నీరు చేరింది. సింగూరు జిల్లాలో భారీ ప్రాజెక్టు కావడం, మిషన్ భగీరథ తాగునీటి పథకానికి, సాగునీటికి ఇదే ప్రధాన వనరుకావడంతో ప్రజలు, నీటిపారుదల శాఖ అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏటా డ్యాంలోకి ఆగస్టు, సెప్టెంబర్లోకి వరదలు వచ్చేవి కానీ ఈ ఏడాది సకాలంలో వానలు కురుస్తుండటంతో వరదలొస్తున్నాయి. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 29.900 టీఎంసీలు కాగా..ప్రస్తుతం 19.288 క్యూసెక్కుల నీరు నిల్వ ఉంది. ప్రతీ రోజు ప్రాజెక్టు నుంచి మిషన్ భగీరథకు 70 క్యూసెక్కులు, జంట నగరాల తాగునీటికి 80 క్యూసెక్కులు సరఫరా చేస్తున్నారు.
పక్షం రోజుల్లో 3 టీఎంసీల నీరు చేరిక
ప్రస్తుతం డ్యాంలో 19.288 టీఎంసీలు