పనులను పరిశీలించిన నౌకాదళ అధికారులు
పూడూరు: మండలంలోని దామగుండం అటవీ ప్రాంతంలో నిర్మిస్తున్న నేవీ రాడార్ స్టేషన్ పనులను సోమవారం భారత నౌకాదళ వైస్ అడ్మిరల్ సంజయ్ వాత్సాయన్, స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పనులను వేగవంతం చేసి సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రాడార్ స్టేషన్ ఏర్పాటుకు ప్రత్యేక చొరవ తీసుకున్న పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డిని సన్మానించి జ్ఞాపిక అందజేశారు. ఈ ప్రాజెక్టు దేశ భద్రతకు ఎంతో ఉపయోగకరమన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి కూడా దోహదం చేస్తుందని పేర్కొన్నారు.


