ప్రపంచ శాంతిని కాపాడాలని నిరసన | - | Sakshi
Sakshi News home page

ప్రపంచ శాంతిని కాపాడాలని నిరసన

Mar 15 2026 6:43 AM | Updated on Mar 15 2026 6:43 AM

కొందుర్గు: తమ ఆర్థిక లాభాల కోసం ఆమెరికా చేస్తున్న సామ్రాజ్యవాద రాజకీయాన్ని విడనాడి ప్రపంచ శాంతిని కాపాడాలని ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట సభ్యుడు ఆకాశ్‌నాయక్‌ డిమాండ్‌ చేశారు. శనివారం జిల్లేడ్‌ చౌదరిగూడ మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆమెరికా ప్రపంచ దేశాల మధ్య చిచ్చుపెడుతుందన్నారు. యుద్ధాలతో విద్య, వైద్య రంగాలకు అందాల్సిన నిధులు ఆయుధాల పాలవుతున్నాయన్నారు. ఇప్పటికై నా యుద్ధం మానుకోవాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు బాబా, శివ, జాకీర్‌, విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement