
శ్మశానవాటికలో చెట్ల నరికివేత
తుర్కయంజాల్: శ్మశానవాటికలోని చెట్లను న రికిన వ్యక్తులకు మున్సిపల్ అధికారులు జరిమానా విధించిన సంఘటన పురపాలకసంఘం పరిధి రాగన్నగూడలో శనివారం చోటు చేసుకుంది. 10వ వార్డులోని శ్మశానవాటికలో ఉన్న 3 పెద్ద కానుగు చెట్లను ఎన్ఎస్ఆర్ నగర్కు చెందిన ఎస్.లక్ష్మయ్య, మల్లయ్య ఎలాంటి అనుమతులు లేకుండా నరికి వాహనంలో తరలించారు. ఆలస్యంగా విషయం తెలుసుకున్న శానిటేషన్ ఇన్స్పెక్టర్ వనిత, కమిషనర్ అమరేందర్రెడ్డి ఆదేశాల మేరకు రూ.15వేలు జరిమానా విధించారు. ఈ కార్యక్రమంలో ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ సురేశ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఇద్దరికి జరిమానా విధించిన అధికారులు