డయాలసిస్‌ పేషంట్ల కోసం ‘ఆశాయే ఇన్‌’ | - | Sakshi
Sakshi News home page

డయాలసిస్‌ పేషంట్ల కోసం ‘ఆశాయే ఇన్‌’

Sep 13 2025 2:37 AM | Updated on Sep 13 2025 7:21 AM

డయాలసిస్‌ పేషంట్ల కోసం ‘ఆశాయే ఇన్‌’

డయాలసిస్‌ పేషంట్ల కోసం ‘ఆశాయే ఇన్‌’

సాక్షి, సిటీబ్యూరో: డయాలసిస్‌ సేవలందించే ప్రముఖ సంస్థ నెఫ్రోప్లస్‌ ఆధ్వర్యంలో నగరంలోని డయాలసిస్‌ పేషంట్ల కోసం ‘ఆశాయే ఇన్‌’ పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో 250 మందికి పైగా పేషంట్లు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. డయాలసిస్‌ పేషంట్ల జీవన ప్రమాణాలను మెరుగుపర్చాలనే లక్ష్యంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని నెఫ్రోకేర్‌ హెల్త్‌ సర్వీసెస్‌ సహ వ్యవస్థాపకులు కమల్‌ డి.షా తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైద్య నిపుణులు డయాలసిస్‌ చేయించుకుంటూనే రోజువారీ సాధారణ జీవితం గడిపేందుకు, డయాలసిస్‌ డైట్‌లో ఉంటూనే ఆహారాన్ని ఆస్వాదించేందుకు, క్షేమంగా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పేషెంట్లకు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement