
చిలుకూరు ఆలయం మూసివేత
మొయినాబాద్: చంద్ర గ్రహణం సందర్భంగా చిలుకూరు బాలాజీ దేవాలయాన్ని ఆదివారం సాయంత్రం మూసివేశారు. ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులకు అవకాశం కల్పించారు. రాత్రి చంద్రగ్రహణం ఉండటంతో సాయంత్రం 4 గంటలకు ఆలయాన్ని మూసివేశారు. గర్భగుడి తలుపులు మూసి తాళాలు వేశారు. ఆలయ గోపురం ప్రధాన ద్వారాన్ని సైతం మూసివేశారు. గ్రహణం తరువాత సోమవారం ఉదయం 8 గంటలకు సంప్రోక్షణ చేసి ఆలయాన్ని తెరువనున్నారు. స్వామివారికి అభిషేకం చేసిన అనంతరం దర్శనానికి భక్తులను అనుమతించనున్నట్టు అర్చకుడు రంగరాజన్ తెలిపారు.
మైసిగండి మైసమ్మ ఆలయం ..
కడ్తాల్: చంద్రగ్రహణం సందర్భంగా మండల పరిధిలోని మైసిగండి మైసమ్మ ఆలయాన్ని ఆదివారం ఉదయం 11 గంటలకు నిర్వాహకులు మూసివేశారు. గ్రహణం ముగిసిన అనంతరం సోమవారం ఉదయం 8 గంటలకు ఆలయ సంప్రోక్షణ, ప్రత్యేక పూజల అనంతరం తిరిగి భక్తుల దర్శనానికి అనుమతి కల్పించనున్నట్టు తెలిపారు.

చిలుకూరు ఆలయం మూసివేత