
● తండ్రి కష్టాలు చూస్తూ పెరిగాం
యాలాల: ఒక వైపు పేదరికం.. మరోవైపు కుటుంబ భారం.. అయినా బెదరకుండా తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించారు ఆ తండ్రి. నాన్న పడిన కష్టానికి ప్రతిఫలంగా నేడు ఆయన పిల్లలు ఉన్నత స్థాయిలో నిలదొక్కుకున్నారు. యాలాల మండల కేంద్రానికి చెందిన లక్ష్మీనారాయణ, భారతి దంపతులకు నలుగురు కొడుకులు, ఒక కూతురు. డిగ్రీ వరకు చదువుకున్న ఆయన ప్రైవేటు పాఠశాలలో విధులు నిర్వహిస్తూ, పాల బూత్ను నిర్వహిస్తూ పిల్లలను చదివించారు. నేడు నలుగురూ ఉన్నత స్థాయిలో నిలిచారు. పెద్ద కొడుకు కేశవ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా, శివ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా, కమల్ హాసన్ పంచాయతీరాజ్ శాఖలో ఏఈగా, విజయ్ రతన్ కొండాపూర్ ప్రభుత్వ ఆస్పత్రి కంటి విభాగంలో ఉద్యోగం చేస్తున్నారు. నాన్న పడ్డ కష్టానికి ప్రతిఫలమే తాము అని నలుగురు కుమారులు పేర్కొన్నారు.