
దరఖాస్తుల ఆహ్వానం
హుడాకాంప్లెక్స్: హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లోని బాలుర, బాలికల పాఠశాలలు, కళాశాలల్లో ఖాళీగా ఉన్న పో స్టులను తాత్కాలిక పద్ధతిలో భర్తీ చేస్తున్నట్లు జోన్–6 జోనల్ అధికారిణి నిర్మల శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 18న చైతన్యపురి మెట్రో పిల్లర్ నంబర్ 1570 సమీపంలోని సరూర్నగర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలలో రిజిస్ట్రేషన్, డెమో ఉంటుందన్నారు. ఉదయం 8 గంటలకు రిజిస్ట్రేషన్, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సంబంధిత సబ్జెక్టుల్లో డెమో నిర్వహించనున్నట్లు వివరించారు. ఇంగ్లిష్, హిందీ, గణితం, ఫిజికల్ సైన్స్, బయోసైన్స్, సాంఘికశాస్త్రం, లైబ్రేరియన్, హెల్త్ సూపర్వైజర్, ఫిజికల్ డైరెక్టర్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ కళాశాలకు సంబంధించి గణితం, బోటని, జువాలజీ, ఫిజక్స్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, సివిక్స్, కామర్స్ సబ్జెక్టులకు రిజిస్ట్రేషన్, డెమోలో ఉంటాయని వివరించారు. ఆసక్తిగల అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్లతో హాజరు కావాలని సూచించారు.
క్రీడా పాఠశాలల్లో అడ్మిషన్స్
4వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
ఇబ్రహీంపట్నం రూరల్: తెలంగాణ ప్రభుత్వ క్రీడా పాఠశాలలు హకీంపేట్– కరీంనగర్, ఆదిలాబాద్లలో 2025–26 సంవత్సరానికి 4వ తరగతిలో ప్రవేశానికి బాలబాలికల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని జిల్లా యువజన, క్రీడల అధికారి ఎర్రబెల్లి వెంకటేశ్వరరావు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. తమ మొబైల్ నుంచి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. మండల స్థాయిలో మండల విద్యాధికారి ఆధ్వర్యంలో ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. వివరాలకు ఎంఈఓను సంప్రదించాలని సూచించారు. ఈ నెల 23న సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో ఈ ఎంపిక ఉంటుందన్నారు. 2016.9.1 నుంచి 31.8.2017 మధ్య జన్మించిన విద్యార్థులు జనన, కుల ధ్రువీకరణ, ఆధార్, ప్రోగెస్ కార్డు, కొత్త బోనాఫైడ్ సర్టిఫికెట్, పాస్ఫొటోలతో హాజరవ్వాలన్నారు. విద్యార్థుల ఎత్తు, బరువు పరిగణనలోకి తీసుకుని 30 మీటర్ల ఫ్లయింగ్ స్టార్ట్, స్టాండింగ్ బ్రాడ్జంప్, 800 మీటర్ల రన్, షటిల్ రన్, మెడిసిన్ బాల్త్రో, వర్టికల్ జంప్, ప్లెక్సిబిలిటీ టెస్టులు నిర్వహించనున్నామని, ఆసక్తిగల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
కార్పొరేషన్ అభివృద్ధికి నిధులు కేటాయించండి
సీఎంను కోరిన మాజీ మేయర్ దంపతులు
బడంగ్పేట్: కార్పొరేషన్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించేలా చూడాలని మాజీ మేయర్ చిగురింత పారిజాత నర్సింహారెడ్డి దంపతులు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని కోరారు. శనివారం ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. వారి వెంట ఏఐసీసీ విచార్ విభాగ్ కోఆర్డినేటర్ బోయపల్లి రాఘవేందర్రెడ్డి తదితరులు ఉన్నారు.
మాలలు ఐక్యంగా పోరాడాలి
మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు మహేశ్
షాద్నగర్రూరల్: రాజ్యాంగం కల్పించిన హక్కులను సాధించుకునేందుకు మాలలు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు మహేశ్ పిలుపునిచ్చారు. శనివారం ఆయన మండల పరిషత్ కార్యాలయ ఆవరణలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద పల్లెపల్లెకు మాలల చైతన్యయాత్ర కార్యక్రమానికి సంబంధించిన కరపత్రం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మహేశ్ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాలలపై వివక్ష చూపుతున్నాయని ఆరోపించారు. రోజురోజుకు మాలలపై దాడులు పెరిగిపోతున్నాయని.. విషప్రచారం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికీ మౌనంగా ఉంటే భవిష్యత్లో తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. సమస్యల పరిష్కారంకోసం మాలలంతా ఏకతాటిపైకి వచ్చి ఐక్యంగా పోరాడాలన్నారు. గ్రామ కమిటీలు, మండల కమిటీలు వేసుకొని సంఘాన్ని బలోపేతం చేసుకుని ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు మహేశ్, నర్సింలు, శేఖర్, అశోక్, జగన్ పాల్గొన్నారు.

దరఖాస్తుల ఆహ్వానం