
● తల్లిలేని లోటు తీర్చాడు..
కుల్కచర్ల: అదో మారుమూల గ్రామం.. అందులో ఒక నిరుపేద రైతు కుటుంబం. చిన్నతనంలోనే తల్లిని కోల్పోవడంతో నాన్నే సర్వంగా మారి తనను ఉన్నత స్థానంలో నిలిపాడు.. ఆయనే నాకు స్ఫూర్తి అని కుల్కచర్ల ఎస్ఐ రమేష్ పేర్కొన్నారు. కొందుర్గు మండలం కాస్లాబాద్కు చెందిన వన్నెగూడ సత్యయ్యకు ఒక కుమారుడు. భార్య చాలా ఏళ్ల క్రితమే చనిపోయింది.. కొడుకు రమేష్ను బాగా చదివించి ఉన్నత స్థానంలో నిలపాలని ఆకాంక్షించారు. అందుకోసం ఎంతో శ్రమించారు. తండ్రి శ్రమను గుర్తించిన రమేష్ అంతే పట్టుదలతో చదివి ఎస్ఐ ఉద్యోగం సాధించారు. తన ఎదుగుదలకు నాన్నే కారణమని, ఆయన స్ఫూర్తితోనే ఈ స్థాయికి చేరుకోగలిగానని గర్వంగా చెప్పారు. రమేష్ ప్రస్తుతం కుల్కచర్ల ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు. నాన్న చూపిన మార్గంలోనే ముందుకు సాగుతానని పేర్కొన్నారు.

● తల్లిలేని లోటు తీర్చాడు..