● జిల్లా వైద్యాధికారి రజిత
సిరిసిల్ల: మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని జిల్లా వైద్యాధికారి ఎస్.రజిత పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని సుందరయ్యనగర్ పట్టణ ఆరోగ్య కేంద్రంలో మంగళవారం ‘ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ‘ప్రపంచ ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. జిల్లా వైద్యాధికారి మాట్లాడుతూ మన చేతుల్లోనే మన ఆరోగ్యం ఆధారపడి ఉందన్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే జీవన శైలిలో మార్పులు చేసుకోవాలన్నారు. నిత్యం వ్యాయాయం, వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని సూచించారు. ఆరోగ్య సంరక్షణపై దృష్టి పెట్టాలని సూచించారు. డిప్యూటీ డెమో రాజ్కుమార్, స్థానిక వైద్యాధికారి సాహితి తదితరులు పాల్గొన్నారు.


