
చిన్న జీవితంలో చిక్కులు వద్దు
సిరిసిల్లకల్చరల్: జీవితం చాలా చిన్నది. వీలైనంత ప్రశాంతంగా జీవించాలే తప్ప చిన్న చిన్న తగా దాలు, స్పర్థలకు పోవద్దని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.నీరజ సూచించారు. సిరిసిల్లలోని జిల్లా కోర్టులో శనివారం నిర్వహించిన మెగా లోక్ అదాలత్లో మాట్లాడారు. పరస్పర చర్చలు, సంప్రదింపుల ద్వారా వివాదాలను పరిష్కరించుకుని ప్రశాంతంగా జీవించాలన్నారు. మెగా లోక్ అదాలత్లో 12,856 కేసుల్లో కక్షిదారులు రాజీమార్గాన్ని అనుసరించారు. రూ.3,88,50,607 విలువైన కేసులు పరిష్కారానికి నోచుకున్నాయి. ఫస్ట్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి బి.పుష్పలత, సీనియర్ సివిల్ జడ్జి పి.లక్ష్మణాచారి, డీఎల్ఎస్ఏ కార్యదర్శి రాధికా జైస్వాల్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎ.ప్రవీణ్, ఫస్ట్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కావేటి సృజన, సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి గడ్డం మేఘన, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జూపెల్లి శ్రీనివాసరావు, జిల్లా అదనపు ఎస్పీ చంద్రయ్య, ప బ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీనివాస్, లోక్ అదాలత్ సభ్యులు ఆడెపు వేణు, చింతోజు భాస్కర్ పాల్గొన్నారు.
సామరస్యంగా మెదలుకోవాలి
వేములవాడ: చిన్నచిన్న తగాదాలతో కేసులు పెట్టుకోవద్దని, సామరస్యంగా మెదలుకోవాలని వేములవాడ సీనియర్ సివిల్ కోర్టు జడ్జి అనిల్కుమార్ జా దవ్ సూచించారు. వేములవాడ కోర్టులో లోక్ అదాలత్లో మాట్లాడారు. లోక్అదాలత్ మెంబర్లు తిరుమల్గౌడ్, అనిల్కుమార్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గుండ రవి పాల్గొన్నారు.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.నీరజ
లోక్అదాలత్లో 12,856 కేసుల పరిష్కారం

చిన్న జీవితంలో చిక్కులు వద్దు