
నీట్లో జాతీయ స్థాయి ర్యాంక్ సాధించిన లాస్యప్రియ
ఒంగోలు టౌన్: నేషనల్ ఎలిజిబులిటీ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) యూజీలో ఒంగోలుకు చెందిన లాస్యప్రియ ప్రతిభ చాటింది. మొత్తం 558 మార్కులతో ఆల్ ఇండియా స్థాయిలో 9031 ర్యాంక్ సాధించింది. లాస్య తండ్రి ములుకుట్ల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రామ్నగర్ మున్సిపల్ హైస్కూలులో ప్రధానోపాధ్యాయుడిగా చేస్తున్నారు. తల్లి ఉషారాణి కొత్తపట్నం జెడ్పీహెచ్ స్కూలులో ఫిజిక్స్ ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్నారు. లాస్య ప్రియ నీట్ లో ర్యాంక్ సాధించడంతో ఉపాధ్యాయ సంఘాల నాయకులు పలువురు అభినందనలు తెలిపారు.