కార్యకర్తలకు అండగా ఉంటాం | - | Sakshi
Sakshi News home page

కార్యకర్తలకు అండగా ఉంటాం

Jun 14 2025 10:12 AM | Updated on Jun 14 2025 10:12 AM

కార్యకర్తలకు అండగా ఉంటాం

కార్యకర్తలకు అండగా ఉంటాం

వేదికపై మాట్లాడుతున్న అనిల్‌కుమార్‌ యాదవ్‌

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి కృషి చేసే ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ మంత్రి, పీఏసీ సభ్యుడు డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌, మాజీ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ అన్నారు. పాతసింగరాయకొండ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో జరగుతున్న బ్రహ్మోత్సవాల సందర్భంగా గురువారం రాత్రి ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో వారు పాల్గొన్నారు. డాక్టర్‌ సురేష్‌ మాట్లాడుతూ కూటమి పాలనలో అక్రమ కేసులు పెట్టడం, దాడులు చేయటం పరిపాటిగా మారిందన్నారు. సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు చేయకుండానే అన్నీ చేశామని చెప్పటం కూటమి ప్రభుత్వానికే చెల్లిందన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తూ పార్టీని అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని, కానీ పార్టీ నాయకులు, కార్యకర్తలు గోడకు కొట్టిన బంతిలా అణగదొక్కే కొద్దీ ఉవ్వెత్తున లేస్తున్నారని, పార్టీ మరింత బలోపేతమవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రజలు భారీగా తరలివచ్చారు. మాజీ పీడీసీసీ బ్యాంకు చైర్మన్‌ డాక్టర్‌ మాదాసి వెంకయ్య, పార్టీ మండల అధ్యక్షుడు మసనం వెంకట్రావు, మండల ప్రధాన కార్యదర్శి కొల్లూరి సాయికోటి, ఎగ్జిక్యూటివ్‌ సభ్యుడు దాసరి శేషయ్య, మాదాల శంకర్‌, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement