ఎంసెట్‌ ఫలితాల్లో జిల్లా విద్యార్థుల ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

ఎంసెట్‌ ఫలితాల్లో జిల్లా విద్యార్థుల ప్రతిభ

Jun 9 2025 10:20 AM | Updated on Jun 9 2025 10:20 AM

ఎంసెట

ఎంసెట్‌ ఫలితాల్లో జిల్లా విద్యార్థుల ప్రతిభ

ఒంగోలు సిటీ: ఆంధ్రప్రదేశ్‌ ఈఏపీ సెట్‌–2025 పరీక్ష ఫలితాలు ఆదివారం విడుదలయ్యాయి. ఫలితాల్లో జిల్లా విద్యార్థులు ప్రతిభ కనబరిచి పలు ర్యాంకులు సాధించారు. ఇంజినీరింగ్‌ విభాగంలో జిల్లాలో మొత్తం 11,007 మంది దరఖాస్తు చేసుకోగా వారిలో పరీక్షకు 10,603 మంది హాజరయ్యారు. వారిలో 7332 మంది క్వాలిఫై అయ్యారు. క్వాలిఫై అయిన వారిలో బాలురు 3973 మంది, బాలికలు 3359 మంది ఉన్నారు. అగ్రికల్చర్‌, ఫార్మసీ విభాగంలో జిల్లాలో మొత్తం 3387 మంది దరఖాస్తు చేసుకోగా వారిలో 3127 మంది పరీక్షకు హాజరయ్యారు. వారిలో 2883 మంది క్వాలిఫై అయ్యారు. క్వాలిఫై అయిన వారిలో బాలురు 819 మంది, బాలికలు 2064 మంది ఉన్నారు. ఒంగోలు నగరానికి చెందిన రాజు వెంకట హాసిని ఎంసెట్‌లో రాష్ట్ర స్థాయిలో 292 వ ర్యాంకును సాధించింది. శ్రీ సరస్వతి విద్యాసంస్థలకు చెందిన ఆర్‌.సుకుమార్‌సాయి 625వ ర్యాంకు, కె.లోకక్రిటీ 897వ ర్యాంకు, గుణశేఖరరెడ్డి 935వ ర్యాంకు సాధించారు. శ్రీ చైతన్య విద్యాసంస్థలకు చెందిన విద్యార్థిని ఎం.సౌమ్యశ్రీ ఇంజినీరింగ్‌ విభాగంలో 426వ ర్యాంకు సాధించారు.

ఎంసెట్‌ ఫలితాల్లో జిల్లా విద్యార్థుల ప్రతిభ 1
1/2

ఎంసెట్‌ ఫలితాల్లో జిల్లా విద్యార్థుల ప్రతిభ

ఎంసెట్‌ ఫలితాల్లో జిల్లా విద్యార్థుల ప్రతిభ 2
2/2

ఎంసెట్‌ ఫలితాల్లో జిల్లా విద్యార్థుల ప్రతిభ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement