సాక్షి, తాడేపల్లి: మంత్రి నారా లోకేష్కు వైఎస్సార్సీపీ మహిళా నేతలు సవాల్ విసిరారు. డీఎస్సీలో అక్రమాలపై చర్చించేందుకు తాము సిద్ధమంటూ ప్రకటించారు. తాడేపల్లి భరతమాత విగ్రహం వద్దకు చేరుకున్న మహిళా నేతలు లక్ష్మీ పార్వతి, శ్యామల, నాగమల్లేశ్వరి, జమ్మలమడక నాగమణి, మంజరీచౌదరి.. లోకేష్ స్థాయికి వైఎస్ జగన్ అవసరం లేదని.. దమ్ముంటే తమతో చర్చకు రావాలని సవాల్ విసిరారు. లోకేష్తో చర్చకు భరతమాత విగ్రహం దగ్గరే వేచి ఉంటామని మహిళా నేతలు తెలిపారు.


