టీడీపీ అరాచకం.. వైఎస్సార్‌సీపీ దళిత మహిళా కార్యకర్త హత్య | YSRCP Dalit Woman Worker Assassination in Kurnool District | Sakshi
Sakshi News home page

టీడీపీ అరాచకం.. వైఎస్సార్‌సీపీ దళిత మహిళా కార్యకర్త హత్య

Jul 12 2024 10:55 AM | Updated on Jul 12 2024 11:31 AM

YSRCP Dalit Woman Worker Assassination in Kurnool District

అధికార మదంతో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు.

సాక్షి, కర్నూలు జిల్లా: అధికార మదంతో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. కర్నూలు జిల్లాలో టీడీపీ అరాచకాలు ఆగడం లేదు. ఆదోని మండలం నాగనాతన హల్లిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్త గుండమ్మను హత్య చేశారు. దళిత మహిళ గుండమ్మ పొలంలో పని చేసుకుంటుండగా టీడీపీ నేత రాగప్పరెడ్డి... ట్రాక్టర్‌తో ఢీకొట్టి హత్య చేశారు. పొలం విషయంలో  టీడీపీ నేతలు ఘర్షణకు దిగారు. దళిత మహిళ గుండమ్మను హత్యచేసి పరారయ్యారు.

పల్నాడు జిల్లాలో టీడీపీ నేతలు ఆగడాలు మితిమీరి పోతున్నాయి. టీడీపీ నేతల వేధింపులకు ఉపాధిహామీ పథకం ఫీల్డ్‌ అసిస్టెంట్‌ బలయ్యారు. ఉద్యోగానికి రాజీనామా చేయాలని టీడీపీ నేతలు బెదిరింపులకు దిగారు. నెల నుంచి ఫీల్డ్‌ అసిస్టెంట్‌ ఆనంద్‌ను టీడీపీ నేతలు వేధిస్తుండగా, ఫిల్డ్‌ అసిస్టెంట్‌ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement