సూపర్‌ సిక్స్‌ ఇచ్చేశారట.. ప్రశ్నిస్తే నాలుక మందమా?: వైఎస్‌ జగన్‌ | YS Jagan Questioned Chandrababu By Super Six | Sakshi
Sakshi News home page

సూపర్‌ సిక్స్‌ ఇచ్చేశారట.. ప్రశ్నిస్తే నాలుక మందమా?: వైఎస్‌ జగన్‌

Jun 19 2025 1:00 PM | Updated on Jun 19 2025 1:25 PM

YS Jagan Questioned Chandrababu By Super Six

సాక్షి, తాడేపల్లి: ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం విద్యా రంగాన్ని భ్రష్టు పట్టించిందని ఆరోపించారు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌. విద్యా రంగంలో మేము తెచ్చిన సంస్కరణలను నాశనం చేశారని అన్నారు. తల్లులకు డబ్బులు ఇవ్వకుండా మోసం చేశారని అన్నారు. దీనిపై ఎవరైనా ప్రశ్నిస్తే.. మీ నాలుక మందం అని బెదిరిస్తారని వైఎస్‌ జగన్‌ తెలిపారు.

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.‘రాష్ట్రంలో దాదాపు 30 లక్షల మంది విద్యార్థులకు తల్లికి వందనం అంటూ కోత పెట్టారు. గట్టిగా నిలదీస్తే ప్లేట్‌ మార్చి రూ.15వేలు కాదు.. రూ.13వేలే అంటున్నారు. రాష్ట్రంలో 67 లక్షల మందికి తల్లికి వందనం ఇస్తామని బాబు ప్లేట్‌ మార్చారు. మరోసారి ప్లేట్‌ తిప్పేసి 54 లక్షల మందికి ఇస్తామంటున్నారు. ఏపీలో ూసూపర్‌ ిసిక్స్‌ ఇచ్చేశామని చంద్రబాబు చెబుతున్నారు. హామీలు అమలు అయ్యాయని చెప్పేశారు. అన్ని హామీలు తీర్చేశారంట. దీనిపై ఎవరైనా ప్రశ్నిస్తే.. మీ నాలుక మందం అని బెదిరిస్తారు. ఇంకా ప్రశ్నిస్తే తప్పుడు కేసులు.. అక్రమ అరెస్ట్‌లు చేశారు.

గతంలో ఉన్న పథకాన్ని భ్రష్టు పట్టించారు. వైఎస్సార్‌సీపీ హయాంలో ప్రతీ తల్లికి అమ్మ ఒడి ఇచ్చాం. ప్రభుత్వ విద్యా రంగాన్ని చంద్రబాబు భ్రష్టు పట్టించారు. మా హయాంలో తెచ్చిన సంస్కరణలను నాశనం చేశారు. పదో తరగతి పరీక్షల మూల్యాంకనంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఫీజు రియింబర్స్‌మెంట్‌ బకాయిలు పేరుకుపోయాయి. కాలేజీల నిర్వహణ భారమైపోయాయి. ఉన్నత విద్య కుంటుపడింది’ అని తెలిపారు. 

బాబు.. బాదుడే.. బాదుడే.. 

  • చంద్రబాబు అన్ని రకాలుగా బాదుతున్నారు. 
  • మూడు లక్షలకు పైగా ఉద్యోగాలు తీసేశారు. 
  • రూ. 15వేల కోట్ల కరెంట్‌ ఛార్జీలతో బాదుడే బాదుడు.
  • ప్రభుత్వ స్కూల్స్‌, కాలేజీలను చంపేసి ప్రైవేటు స్కూల్స్‌, కాలేజీల్లో ఫీజులు పెంచారు. 
  • సబ్సిడీకే కంది పప్పు ఇచ్చే కార్యక్రమం కూడా మానేశారు. 
  • ఇంటింటికీ రేషన్‌ ఇచ్చే వాహనాలను ఆపేశారు. 
  • ఉన్న పీఆర్‌సీని రద్దు చేశారు. 
  • కొత్త పీఆర్‌ఎసీ అమలుకు నోచుకోలేదు. 
  • ఐఆర్‌ ఇస్తామని ఉద్యోగులను మోసం చేశారు. 
  • ప్రభుత్వ ఉద్యోగులను కూడా మోసం చేశారు. 
  • చంద్రబాబు మోసంతో జనం ఇబ్బంది పడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement