జనవరిలో గల్ఫ్‌ పాలసీ తెస్తాం

minister ktr key comments on gulf policy in gambhiraopet road show - Sakshi

గల్ఫ్‌ కార్మీకులకు రూ.5 లక్షల బీమా కల్పిస్తాం: మంత్రి కేటీఆర్‌

బీడీ కార్మీకుల పీఎఫ్‌ కటాఫ్‌ తేదీని మార్చి మరో లక్ష మందికైనా పెన్షన్లు ఇస్తాం.. 

కాంగ్రెస్, బీజేపీలవి డ్రామాలు 

ఈ ఎన్నికలు మార్చిలో ఫెయిలైతే.. సెప్టెంబరులో రాసే పరీక్షల్లాంటివి కాదు.. 

ఆగం కావద్దు.. ఆలోచించి ఓటేయాలని పిలుపు 

రాజన్న సిరిసిల్ల, మెదక్‌ జిల్లాల్లో ప్రచారం

సిరిసిల్ల/నర్సాపూర్‌: తెలంగాణలో గల్ఫ్‌ కార్మీకుల కోసం ప్రత్యేక గల్ఫ్‌ పాలసీని తెస్తామని ఐటీ, మున్సిపల్‌ శాఖల మంత్రి కె.తారక రామారావు అన్నారు. గల్ఫ్‌ కార్మికులకు రైతుబంధు తరహాలో రూ.5 లక్షల బీమా సదుపాయం కల్పిస్తామని హామీ ఇచ్చారు. గల్ఫ్‌ కార్మీకులు చనిపోతే, వారి కుటుంబాలకు రూ.5 లక్షలిస్తామన్నారు. జనవరిలో సమగ్ర గల్ఫ్‌ పాలసీ తెచ్చి వలస కార్మీకుల సంక్షేమానికి బాటలు వేస్తామని చెప్పారు. 

దేశంలోని 16 రాష్ట్రాల్లో బీడీ కార్మీకులుంటే ఏ రాష్ట్రంలోనూ పెన్షన్‌ ఇవ్వడం లేదని, తెలంగాణలోనే ఇస్తున్నామని చెప్పారు. బీడీ కార్మీకుల పీఎఫ్‌ కటాఫ్‌ తేదీని మార్చి మరో లక్ష మందికైనా పెన్షన్‌ ఇస్తామన్నారు. జనవరి, ఫిబ్రవరిలో కొత్త రేషన్‌ కార్డులు ఇస్తామని, వాటిపై 93 లక్షల కుటుంబాలకు సన్న బియ్యం ఇస్తామని స్పష్టం చేశారు. ఆదివారం కేటీఆర్‌ రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, మెదక్‌ జిల్లా నర్సాపూర్‌లో ఆదివారం నిర్వహించిన రోడ్‌ షోలు, సభల్లో మాట్లాడారు. ‘ఇవి మామూలు ఎన్నికలు కావు. మార్చిలో ఫెయిలైతే సెప్టెంబరులో రాసే పరీక్షల్లాంటివి కాదు.

ఐదేళ్లు మీ తలరాతను రాసే ఎన్నికలు. ఆగం కావద్దు.. సంక్షేమం.. అభివృద్ధి కొనసాగాలంటే.. కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా కొనసాగాలి’అని కేటీఆర్‌ చెప్పారు. రైతుబంధు దుబారా అని కాంగ్రెస్‌ నేత ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అంటున్నారని, ధరణి తీసేసి భూమాత తెస్తామని భట్టి విక్రమార్క అంటున్నారని, మళ్లీ దళారీ వ్యవస్థను తేవాలని చూస్తున్నారని కేటీఆర్‌ చెప్పారు. వ్యవసాయానికి మూడే గంటల కరెంట్‌ చాలని రేవంత్‌రెడ్డి చెబుతున్నారని, పొరపాటున కాంగ్రెస్‌ వస్తే.. మళ్లీ పవర్‌ హాలిడేలు.. ట్రాన్స్‌ఫార్మర్లు పేలిపోవడాలు ఉంటాయన్నారు.

కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి కరెంటు కనిపిస్త లేదంటున్నాడని, ఎక్కడైనా కరెంటు కనిపిస్తదా అని ఎద్దేవా చేశారు. ఒక్కసారి కరెంటు లైన్‌ను పట్టుకుంటే కరెంటు ఉందో లేదో తెలుస్తుందని, షాక్‌ కొట్టి పోతే రాష్ట్రానికి దరిద్రం పోతుందన్నారు. రైతులకు రూ.14 వేల కోట్ల రుణమాఫీ అయిందని, ఇంకా కొంత పెండింగ్‌లో ఉందని అది కూడా పూర్తవుతుందని చెప్పారు. రైతుబంధు ఒకటి, రెండురోజుల్లో జమ అవుతుందని వివరించారు.  

మోదీ 15 లక్షలు వేశారా? 
ఎన్నికలు రాగానే కాంగ్రెస్, బీజేపీ నాయకులు డ్రామాలు వేస్తున్నారని కేటీఆర్‌ మండిపడ్డారు. 2014లో తమ ప్రభుత్వం రాగానే అందరి ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తామని ప్రధాని మోదీ చెప్పారని, ఎవరి ఖాతాల్లోనైనా పైసలు పడ్డాయా అని ప్రజలను ప్రశ్నించారు. అలాగే, గ్యాస్‌ ధర తగ్గిస్తామని చెప్పి, రూ.400 ఉన్న సిలిండర్‌ ధరను రూ.1,200కు పెంచారని ధ్వజమెత్తారు. బీఆర్‌ఎస్‌ మరోసారి అధికారంలోకి రాగానే రూ.400కే సిలిండర్‌ ఇచ్చి మిగిలిన రూ.800 తమ ప్రభుత్వం భరిస్తుందన్నారు.

ఒక్కసారి చాన్స్‌ ఇవ్వాలని కాంగ్రెస్‌ నాయకులు కోరుతున్నారని 50 ఏళ్లలో 11 సార్లు చాన్స్‌ ఇస్తే ఏం చేశారని నిలదీశారు. రేవంత్‌రెడ్డి టికెట్లు అమ్ముకున్నారని, బీసీ బిడ్డ గాలి అనిల్‌కుమార్‌ గొంతు కోసి టికెట్‌ అమ్ముకున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమాల్లో నర్సాపూర్‌ పార్టీ అభ్యర్థి సునీతారెడ్డి, ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి, ఎమ్మెల్సీ వెంకట్రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

27-11-2023
Nov 27, 2023, 05:39 IST
నాకు తెలంగాణ తీసుకువచ్చిన ఘనతే ఆకాశమంత పెద్దది. దానికి మించిన పదవి ఉందా? రెండుసార్లు సీఎంగా పనిచేసిన. పదేళ్లు సీఎంగా...
27-11-2023
Nov 27, 2023, 04:27 IST
సాక్షి, కామారెడ్డి/సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘ప్రజల తెలంగాణ కల సాకారం కాబోతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ భారీ మెజారిటీతో అధికారంలోకి రాబోతోంది....
27-11-2023
Nov 27, 2023, 03:53 IST
నిర్మల్‌/మెదక్‌: తెలంగాణలో మొదటిసారిగా బీజేపీ సర్కార్‌ ఏర్పాటు కానుందని.. సకల జనులంతా బీజేపీ వెంటే ఉన్నారని ప్రధాన మంత్రి నరేంద్ర...
26-11-2023
Nov 26, 2023, 17:12 IST
హైదరాబాద్‌: తెలంగాణలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని ప్రధాని మోదీ అన్నారు. అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. సచివాలయానికి వెళ్లని...
26-11-2023
Nov 26, 2023, 15:10 IST
తెలంగాణను బలవంతంగా ఏపీలో కలిపిందే కాంగ్రెస్‌. కాంగ్రెస్‌ ఏకపక్ష నిర్ణయంతో 58 ఏళ్లు గోస పడ్డాం.
26-11-2023
Nov 26, 2023, 14:59 IST
సాక్షి, కరీంనగర్‌: 'ఏ దేశమేగినా ఎక్కడున్నా ఓటే తమ అభిమతమని చాటుతున్నారీ యువత. ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగమే తమ నినాదమని ధీమాగా...
26-11-2023
Nov 26, 2023, 14:42 IST
సాక్షి, సంగారెడ్డి: ‘కేసీఆర్‌జీ నువ్వు కాళేశ్వరంలో ఎంత దోపిడీ చేశావో చెప్పు. మీరు తెలంగాణ ఇరిగేషన్ మినిస్టర్. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో లక్ష కోట్ల దోపిడీ చేశావని కాంగ్రెస్...
26-11-2023
Nov 26, 2023, 14:14 IST
ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు పడరాని పాట్లు పడుతున్నారు. మరోవైపు ప్రధాన పార్టీలు.. 
26-11-2023
Nov 26, 2023, 14:14 IST
ప్రధాన పార్టీలేమో వ్యూహాత్మక ఎత్తుగడల నడుమ కీలక నేతల పోరు తెలంగాణ ఎన్నికలకు ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నాయి.
26-11-2023
Nov 26, 2023, 13:35 IST
కరీంనగర్‌ అర్బన్‌: మన దేశంలో కొన్నిచోట్ల 60 శాతం ఓటింగ్‌ జరిగితే గొప్పగా చెప్పుకునే పరిస్థితి ఉంది. అందుకే దీన్ని...
26-11-2023
Nov 26, 2023, 12:11 IST
‘తమ్మీ మీ ఊళ్లో గాలి ఎటు వీస్తుంది? ఓటర్లు ఏమనుకుంటున్నరు? మనమీద ఎవైరైనా నారాజ్‌గా ఉన్నార? ఉంటే చెప్పు. వాళ్లను...
26-11-2023
Nov 26, 2023, 12:01 IST
భద్రాచలం అర్బన్‌: శాసనసభ ఎన్నికల సమరంలో డబ్బు కీలకపాత్ర పాత్ర పోషిస్తుందన్నది ఎవరూ కాదనలేని అంశం! అయితే, ఎన్నికల నియమావళి...
26-11-2023
Nov 26, 2023, 11:52 IST
 సత్తుపల్లి: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనూ జలగం వెంగళరావు పరిచయం అక్కరలేని పేరు. ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, హోంమంత్రి, జిల్లా...
26-11-2023
Nov 26, 2023, 07:44 IST
సాక్షి, ఆదిలాబాద్‌: ‘బీఆర్‌ఎస్‌, బీజేపీ ఒక్కటే.. ఈ రెండు పార్టీలకు మూడో దోస్తు ఎంఐఎం.. ఈ ఎన్ని కల్లో ఆ...
26-11-2023
Nov 26, 2023, 06:38 IST
సాక్షి, కామారెడ్డి/అబిడ్స్‌/మలక్‌పేట: ‘కేసీఆర్‌ మూడోసారి ముఖ్యమంత్రి కాంగనే ఉత్తిగ ఊకుండడు... ఢిల్లీలోనూ తెలంగాణ జెండా పాతుతడని ఢిల్లీ లీడర్లు మోదీ,...
26-11-2023
Nov 26, 2023, 04:50 IST
సాక్షి, హైదరాబాద్‌: రాజకీయ నిరుద్యోగంతో బాధ పడుతున్న కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ యువతను రెచ్చగొట్టి చిచ్చు పెట్టాలని చూస్తున్నారని...
26-11-2023
Nov 26, 2023, 04:47 IST
ఆమనగల్లు, బన్సీలాల్‌పేట్‌: రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీని ఓడించేందుకు బీజేపీ, బీఆర్‌ఎస్, ఎంఐఎం ఒక్కటయ్యాయని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు....
26-11-2023
Nov 26, 2023, 04:37 IST
సాక్షి, హైదరాబాద్‌: ఎన్నికల ప్రచారంతోపాటు పోలింగ్‌ ముగిసేదాకా పార్టీ యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉండాలని.. క్షేత్రస్థాయిలో ఒక్కో ఓటును ఒడిసిపట్టాలని బీఆర్‌ఎస్‌...
26-11-2023
Nov 26, 2023, 04:30 IST
సాక్షి, కామారెడ్డి/సాక్షి, రంగారెడ్డి జిల్లా: తెలంగాణ అంతటా బీజేపీ గాలి వీస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. రాష్ట్ర ప్రజలు...
25-11-2023
Nov 25, 2023, 18:12 IST
సాక్షి, హైదరాబాద్‌ : ముగ్గురు అమ్మాయిలు. ముగ్గురూ నాన్న కుట్టిలే. నాన్నతో ప్రత్యేక అనుబంధాన్ని కలిగి ఉన్నవారే. ఇపుడు నాన్నలు లేరు....



 

Read also in:
Back to Top