హైడ్రాపై మరోసారి దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు | Danam Nagender Once Again Sensational Comments On HYDRA | Sakshi
Sakshi News home page

హైడ్రాపై మరోసారి దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు

Jan 12 2025 1:39 PM | Updated on Jan 12 2025 1:58 PM

Danam Nagender Once Again Sensational Comments On HYDRA

ఈ-కార్‌ రేస్‌లో కేటీఆర్‌కు తాను క్లీన్‌చిట్‌ ఇవ్వలేదని ఎమ్మెల్యే దానం నాగేందర్‌ అన్నారు.

సాక్షి, హైదరాబాద్‌: ఈ-కార్‌ రేస్‌లో కేటీఆర్‌కు తాను క్లీన్‌చిట్‌ ఇవ్వలేదని ఎమ్మెల్యే దానం నాగేందర్‌ అన్నారు. హైదరాబాద్‌కు ఇమేజ్‌ పెరిగిందని మాత్రమే చెప్పానని.. విచారణ జరిగేటప్పుడు కామెంట్‌ చేయడం సరికాదన్నారు. క్విడ్‌ప్రోకో జరిగిందా లేదా తేల్చాలి. హైడ్రా వల్ల ప్రభుత్వానికి డ్యామేజ్ అయిందని మళ్లీ చెబుతున్నాను. దీనిపై ప్రభుత్వం పునరాలోచించాలి. తాను ఫైటర్‌ను.. ఉప ఎన్నికకు భయపడేది లేదని దానం అన్నారు.

‘‘నేను ఏది మాట్లాడినా కూడా సంచలనమే అవుతుంది. మూసీపై కంటి తుడుపు చర్యల్లాగా ఒక్కరోజు మూసీ నిద్ర చేశారని.. వారు నిద్ర చేయడానికి వెళ్లే ముందే ఏసీలు పెట్టించుకుని పడుకున్నారు. వారి ఇళ్లల్లోనే చేసిన జొన్న రొట్టెలు తినకుండా.. కిషన్ రెడ్డి బయట నుంచి ఇడ్లీలు తెప్పించుకుని తిన్నారు. హైదరాబాద్ కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువగా ఉందని ఇక్కడికి కొన్ని సంస్థలు వచ్చి స్థిరపడ్డాయి. హైదరాబాద్ సేఫెస్ట్ సిటీ కాబట్టి ముంబయికి వెళ్ళే ఇన్వెస్టర్లు ఇక్కడికి వస్తున్నారు.’’ అని దానం నాగేందర్‌ చెప్పారు.

‘‘పదేళ్ల అనంతరం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర బడ్జెట్ చూస్తే ఖాళీగా ఉంది. అయినా ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం ముందుకెళ్తుంది. రుణమాఫీ, రైతు భరోసా అమలు జరుగుతున్నందున సీఎంకి పాలాభిషేకం చేయాలి’’ అంటూ దానం నాగేందర్‌ వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి: హైదరాబాద్‌లో లక్ష ఇళ్లు @సేల్‌!

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement