
( ఫైల్ ఫోటో )
అనకాపల్లి జిల్లా: సబ్బవరం పోలీస్ స్టేషన్ లో నారా లోకేష్ పై ఫిర్యాదు నమోదైంది. గన్నవరంలో రెండు రోజులు క్రితం నారా లోకేష్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై వైఎస్ఆర్సీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా వ్యాఖ్యలు ఉన్నాయంటూ పేర్కొన్నారు.
విద్వేషపూరిత ప్రసంగాలతో వర్గ విభేదాలు రెచ్చగొట్టి శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు కుట్రపన్నిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పెందుర్తి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కన్వీనర్ ఇండుగు బల్లి దేవుడు బాబు పోలీసు శాఖను కోరారు.
ఇదీ చదవండి: జాతీయ స్థాయిలో సత్తాచాటిన కాకినాడ.. స్మార్ట్ సిటీ అవార్డుల్లో రెండో స్థానం