తెలంగాణలో పొలిటికల్‌ ట్విస్ట్‌.. జితేందర్‌ రెడ్డి ఇంటికి రేవంత్‌ | CM Revanth Reddy Meets BJP Ex-MP Jithender Reddy | Sakshi
Sakshi News home page

తెలంగాణలో పొలిటికల్‌ ట్విస్ట్‌.. జితేందర్‌ రెడ్డి ఇంటికి రేవంత్‌

Mar 14 2024 1:21 PM | Updated on Mar 14 2024 3:10 PM

CM Revanth Reddy Meets BJP Ex MP Jithender Reddy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల వేళ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీ సీనియర్‌ నేత జితేందర్‌ ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా జితేందర్‌ రెడ్డితో భేటీ అయ్యారు. 

అయితే, రానున్న లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో జితేందర్‌ రెడ్డి మహబూబ్‌నగర్‌ ఎంపీ స్థానం నుంచి ఆశించారు. మొదటి నుంచి ఇక్కడ పోటీ చేయాలని జితేందర్‌ రెడ్డి ప్లాన్‌ చేసుకున్నారు. కానీ, బీజేపీ హైకమాండ్‌ మాత్రం జితేందర్‌ రెడ్డిని కాదని డీకే అరుణకు అవకాశం కల్పించింది. దీంతో, టికెట్‌ ఆశించిన జితేందర్‌ రెడ్డి భంగపాటుకు గురయ్యారు. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్‌ ఆయన ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌తో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌ రెడ్డి ఉన్నారు. 

ఈ సందర్భంగా జితేందర్‌ రెడ్డి మాట్లాడుతూ.. రేవంత్‌ మా ఇంటికి రావడం కొత్తేమీ కాదు. తన అన్న ఇంటికి వచ్చాడు అంతే. మాది ఒక్కటే జిల్లా. నాకు సీటు రాలేదని ఓదర్చాడానికే వచ్చాడు. నేను ప్రస్తుతం బీజేపీలోనే ఉన్నాను. బీజేపీలో సంతోషంగానే ఉన్నాను. నా సీటు గురించి అధిష్టానం చూసుకుటుంది. కాంగ్రెస్‌లో టికెట్లు ఫుల్‌ ఫిల్‌ అయ్యాయి. మహబూబ్‌నగర్‌లో వంశీ, చేవెళ్లలో పట్నం మహేందర్‌ రెడ్డి కాంగ్రెస్‌కు ఉన్నారు. పార్టీలోకి సీఎం రేవంత్‌ నన్ను ఆహ్వానించలేదు. నేను కూడా ఏమీ మాట్లాడలేదు. కేవలం పరామర్శ కోసమే రేవంత్‌ మా ఇంటికి వచ్చాడు అని వ్యాఖ్యలు చేశారు.

ఇదిలా ఉండగా.. బీజేపీ కేంద్ర పెద్దలపై జితేందర్‌ రెడ్డి ఎప్పటికప్పుడు సెటైర్లు వేస్తూనే ఉన్నారు. జితేందర్‌ రెడ్డి గతంలో బీజేపీ హైకమాండ్‌ను టార్గెట్‌ చేసి పలు సెటైరికల్‌ వీడియోలను సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేశారు. ఇటీవల కూడా ఒక వీడియోను షేర్‌ చేయడంతో​ బీజేపీ నేతలు ఖంగుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీ హైకమాండ్‌ జితేందర్‌ రెడ్డి సీటు నిరాకరించినట్టు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement