
జేసీ శోభిక సేవలు ప్రశంసనీయం
పార్వతీపురం రూరల్: పార్వతీపురం మన్యం జిల్లాకు జాయింట్ కలెక్టర్గా ఎస్ఎస్ శోభిక అందించిన సేవలు ప్రశంసనీయమని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ అన్నారు. బదిలీపై వెళ్తున్న ఆమెకు కలెక్టరేట్లో జిల్లా అధికారులు, రెవె న్యూ అధికారులు శనివారం వీడ్కోలు పలికా రు. ఆమెను దుశ్శాలువలు, జ్ఞాపికలతో సత్క రించారు. ఎన్నికల నిర్వహణ, ధాన్యం సేకరణలో ఆమె ప్రతిభను కలెక్టర్ ప్రశింసించారు. జిల్లా ఎస్పీ ఎస్వీ మాధవ్రెడ్డి మాట్లా డుతూ శోభిక పరిపాలనలో మంచి సహాయ సహకారాలు అందించారన్నారు. శోభిక మాట్లాడుతూ జిల్లాలో పనిచేయడం సంతృప్తినిచ్చిందని, అనుభవాలను నేర్పిందన్నారు. కార్యక్రమంలో డీఆర్ఓ కె.హేమలత, సబ్ కలెక్టర్లు ఆర్.వైశాలి, పవర్ స్వప్నిల్ జగన్నాథ్, డిప్యూటీ కలెక్టర్ ధర్మచంద్రారెడ్డి, దిలీప్చక్రవర్తి పాల్గొన్నారు.
అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు
పార్వతీపురం రూరల్: జిల్లాలో ఎవరైనా ఎరువులను అధిక ధరలకు విక్రయాలు జరిపితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ హెచ్చరించారు. జిల్లాలో ప్ర స్తుతం 783 మెట్రిక్ టన్నుల యూరియా ప్రభు త్వ, ప్రైవేట్ దుకాణాల్లో నిల్వ ఉందన్నారు.
ఖైదీల ప్రవర్తన గమనించాలి
పాలకొండ రూరల్: రిమాండ్ ఖైదీల ప్రవర్తనను జైలు అఽధికారులు, సిబ్బంది గమనించాలని ఆ శాఖ జిల్లా అధికారి కె.మోహనరావు సూచించారు. పాలకొండ సబ్ జైలును స్థానిక డీఎస్పీ ఎం.రాంబాబుతో కలిసి శనివారం సందర్శించారు. ఖైదీల ఆరోగ్య రక్షణకు తీసుకుంటున్న చర్యలు, అందుబాటులో ఉన్న వసతులపై ఆరా తీశారు. డీఎస్పీ మాట్లాడుతూ జైలు పరిసరాల్లో ఎటువంటి మారణాయుధాలు ఉండకుండా చూడాలని సూపరింటెండెంట్ బి.జోగులకు సూచించారు. వారి వెంట హెడ్వార్డర్ రమణ, ఏఎస్సై శ్రీనివాసరావు, సిబ్బంది నాగరాజు, హేమసుందర్, సత్యారావు, నాయుడు, హరికృష్ణ ఉన్నారు.
రాజ్యలక్ష్మికి లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు
విజయనగరం అర్బన్: జేఎన్టీయూ గురజాడ విజయనగరం (జీవీ) యూని వర్సిటీ ఇన్చార్జి వీసీ ప్రొఫెసర్ డి.రాజ్యలక్ష్మికి ప్రతిష్టాత్మక ‘లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఫర్ అకడమిక్ లీడర్షిప్’లభించింది. కౌన్సిల్ ఫర్ స్కిల్స్ అండ్ కంపెటెన్సీస్ (సీఎసీసీ ఇండియా) సంస్థ ఈ అవార్డును ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రదానం చేసినట్టు శనివారం ఓ ప్రకటనలో ఆమె తెలిపారు. ఆమెకు వర్సిటీ సిబ్బంది అభినందనలు తెలిపారు.
ఏపీపీఎస్సీ పరీక్ష కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు
విజయనగరం అర్బన్: జిల్లాలో ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో ఆదివారం జరగనున్న ఫారెస్టు బీట్ ఆఫీసర్లు, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్లు, సెక్షన్ ఆఫీసర్ల పరీక్ష కోసం అభ్యర్థులకు సహాయం అందించేందుకు కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశామని జిల్లా రెవెన్యూ అధికారి ఎస్.శ్రీనివాసమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు తమ సందేహాల నివృత్తికి కంట్రోల్ రూమ్ నంబర్ 08922– 236947ను సంప్రదించాలని కోరారు.
ముగిసిన నవోదయ స్కూల్ టీచర్ల ఇంటర్వ్యూ
విజయనగరం అర్బన్: జిల్లాలోని జవహర్ నవోదయ స్కూల్లో ఉపాధ్యాయుల నియామకం కోసం కలెక్టరేట్లోని జాయింట్ కలెక్టర్ చాంబర్లో శనివారం నిర్వహించిన ఇంటర్వ్యూ ప్రక్రియ ముగిసింది. జేసీ సేతుమాధవన్ పర్యవేక్షణలో నిర్వహించిన ఈ ప్రక్రియలో పీజీటీ ఇంగ్లిష్ ఒకటి, ఫిజిక్స్ ఒకటి, లెక్కలు రెండు పోస్టుల కోసం ఇంటర్వ్యూలు చేపట్టారు. ఏడాది కాలానికి కాంట్రాక్ట్ విధానంలో పనిచేయాడానికి ఎంపికలు నిర్వహించారు. మెరిట్ అభ్యర్థులను నియమిస్తామని జేసీ తెలిపారు.

జేసీ శోభిక సేవలు ప్రశంసనీయం

జేసీ శోభిక సేవలు ప్రశంసనీయం