గత రెండు సంవత్సరాలుగా నా భర్తను టీడీపీ నేతలు సీఐ వెంకట్రావు సహకారంతో వేధిస్తున్నారు. ఇప్పటికే రూ.30 లక్షలు కట్టించుకున్నా అక్రమ కేసులు బనాయిస్తునే ఉన్నారు. ఆదివారం సైతం తీవ్రంగా కొట్టడంతో అనారోగ్యానికి గురయ్యాడు. కులం పేరుతో సీఐ తిడుతూ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. దాన్ని తట్టుకోలేకనే నా భర్త ఆత్మహత్యాయత్నం చేశాడు. కష్టపడి సంపాదించిన ఆస్తి అంతా లాక్కుంటున్నారు. సీఐపై చర్యలు తీసుకోకుంటే పిల్లలతో కలసి కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవడమే దిక్కు.
– జడ యామిని,
దళిత నేత సురేంద్ర భార్య


