అడ్మిషన్ల పెంపునకు కృషి చేయండి | - | Sakshi
Sakshi News home page

అడ్మిషన్ల పెంపునకు కృషి చేయండి

Jul 25 2025 4:34 AM | Updated on Jul 25 2025 4:34 AM

అడ్మిషన్ల పెంపునకు కృషి చేయండి

అడ్మిషన్ల పెంపునకు కృషి చేయండి

పిడుగురాళ్ల: ఈ విద్యా సంవత్సరంలో అడ్మిషన్ల పెంపునకు హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక విద్యా పీఠం(ఏపీఓపెన్‌ స్కూల్‌సొసైటీ) రాష్ట్ర కో–ఆర్డినేటర్‌ పి.రవీంద్రనాథ్‌ సూచించారు. పట్టణంలోని మన్నెం పుల్లారెడ్డి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను గురువారం ఆయన సందర్శించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ... పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ప్రతి ఏడాది పెరగాలన్నారు. అలాగే విద్యార్థులకు ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని సౌకర్యాలను అందించాలన్నారు. అనంతరం ఓపెన్‌ స్కూల్‌ పోస్టర్‌లను ఆవిష్కరించారు. పాఠశాల హెచ్‌ఎం మల్లిఖార్జునరావు మాట్లాడుతూ... ఈ విద్యా సంవత్సరం అడ్మిషన్లు జరుగుతున్నాయని, ఈ నెల 30వ తేదీ నుంచి ఆగస్టు 14వ తేదీ వరకు అపరాధ రుసుం రూ.200 చెల్లించి అడ్మిషన్లు పొందవచ్చని తెలిపారు. మరిన్ని వివరాలకు 9440004297, 8522994297 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీ సార్వత్రిక విద్యా పీఠం పల్నాడు జిల్లా కో–ఆర్డినేటర్‌ హుస్సేన్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఏపీ సార్వత్రిక విద్యాపీఠం రాష్ట్ర కో–ఆర్డినేటర్‌ పి.రవీంద్రనాథ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement