మత్స్యశాఖ అధికారులు పొగురు( ఇసుక మేటలు)తొలగించేందుకు చర్యలు తీసుకోవాలి. లేకపోతే తుపాను అనంతరం కూడా జెట్టీ నుంచి మెకనైజ్డ్ బోట్లు వేటకు వెళ్లలేని పరిస్థితి ఎదురవుతుంది. దీంతో లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి కొనుగోలు చేసిన బోట్లు పాడైపోతాయి. వలలు, ఐస్బాక్స్లు, బోట్లు సబ్సిడీపై అందించాలి.
– కె.సింహాచలం, మత్స్యకారుడు, మంచినీళ్లపేట
చేప చిక్కడం లేదు
గత ఏడాది ఈ సీజన్లో అడపా దడపా చేపలను అమ్ముకున్నాం. కానీ ఈ ఏడాది చేప మాత్రం చిక్కడం లేదు. అలలు ఎగసి ప డుతున్నాయి. అలల ధాటికి తీ రం కోతకు గురైంది. వేటలేక పస్తులు ఉంటున్నా.
– సీహెచ్ భీమారావు,
మత్స్యకారుడు, మంచినీళ్లపేట
తున్నారు. చిరిగిన వలలకు మరమ్మతులు చేసుకుంటున్నామని తెలిపారు. మత్స్య సంపద బాగా తగ్గిపోయిందని, సీజన్లో పడాల్సిన చేపలు వలకు చిక్కడం లేదన్నారు.
వేట నిషేధం అనంతరం ఏటా ఈ సీజన్లో విలువైన రొయ్యిలు, కానాగత్తలు ఇతర చేపలు వలకు చిక్కాలి. కానీ ఆ పరిస్థితి లేదు. నెలలో రూ. 20వేలు వరకు డీజిల్ ఖర్చు చేసి వేటకు వెళ్లినా మదుపు రావడం లేదని వాపోతున్నారు. దీంతో యువకులు కాండ్లా, గుజరాత్, గోవాతో పాటు ఇతర రాష్ట్రాలకు వలస పోతున్నారు.


