
పంచాయతీలుగా గుర్తించండి
రాయగడ: జిల్లాలోని మునిగుడ సమితి పరిధి బిజాబొండిలి, హటొశశిఖాల్ ప్రాంతాలను పంచాయతీలుగా గుర్తించాలని ఆ ప్రాంత ప్రజలు డిమాండ్ చేశారు. ఈ మేరకు శివపొదొరొ బికాస్ పరిషత్ అధ్యక్షుడు చంద్రశేఖర్ బెహర నేతృత్వంలో ఒక ప్రతినిధి బృందం మంగళవారం బీడీవో కృష్ణచంద్ర దొలొ, అదనపు తహసీల్దార్ సుబేందు సాహులకు వినతిపత్రాన్ని సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా పంచాయతీలను ఏర్పాటు చేసే ప్రక్రియలో భాగంగా ప్రజాభిప్రాయాలను సేకరిస్తోందని, దీనిలో భాగంగా మునిగుడ సమితిలోని శివపదర్ పంచాయతీలో భాగమైన బిజాబొండిలి, హటొశశిఖాల్లను పంచాయతీలుగా గుర్తించగలిగితే ప్రజలు మరిన్ని సౌకర్యాలు పొందే అవకాశం ఉందని వినతిపత్రంలో వివరించారు. జనాభాపరంగా అభివృద్ధి చెందుతున్న శివపదర్ పంచాయతీ మరింత అభివృద్ధి చెందాలంటే కొత్తగా రెండు పంచాయతీల ఏర్పాటు అనివార్యమని పేర్కొన్నారు.