–IIలోu | - | Sakshi
Sakshi News home page

–IIలోu

Jun 15 2025 7:19 AM | Updated on Jun 15 2025 7:19 AM

–IIలో

–IIలోu

ఆదివారం శ్రీ 15 శ్రీ జూన్‌ శ్రీ 2025
నాన్న శ్రమజీవి. కుటుంబం కోసం అలుపెరుగని ప్రయాణం సాగిస్తాడు. బిడ్డల భవిష్యత్‌ కోసం త్యాగాలు చేస్తాడు. తన ఇష్టాలను దూరం చేసుకొని, పిల్లల ఇష్టాలనే తన ఇష్టాలుగా మార్చుకుంటాడు. తప్పు చేసినప్పుడు కోపాన్ని చూపిస్తూనే.. ఆ తప్పులు సరిదిద్దుకునేలా మంచి మార్గాన్ని చూపుతాడు. అదే పిల్లలు దివ్యాంగులైతే అల్లాడిపోతూనే అల్లారుముద్దుగా చూసుకుంటాడు. అలాంటి తండ్రే మల్కన్‌గిరి సమితిలోని తొండికి పంచాయతీకి చెందిన రామకృష్ణ. తాను గత 22 ఏళ్లుగా దివ్యాంగులైన పిల్లలే ప్రపంచంగా జీవిస్తున్నాడు. తాను కష్టపడుతూ పిల్లలకు కష్టం తెలియకూడదని నిరంతరం తపిస్తున్నాడు. – మల్కన్‌గిరి

దివ్యాంగ పిల్లలను కంటికి రెప్పలా

చూసుకుంటున్న రామకృష్ణ

చిన్నారులే ప్రపంచంగా జీవితం

నేడు ఫాదర్స్‌ డే

పిల్లలతో రామకృష్ణ

నలుగురు పిల్లలూ దివ్యాంగులే...

తొండికి గ్రామానికి చెందిన రామకృష్ణకు అదే గ్రామానికి చెందిన బసంతితో 2003లో వివాహం జరిగింది. వీరికి మొదటి సంతానంగా 2004లో మమత అనే కుమార్తె జన్మించింది. ఆడపిల్ల పుట్టడంతో కుటుంబమంతా ఎంతో ఆనందంగా గడిపారు. అయితే బిడ్డకు మూడు నెలల వయస్సు వచ్చిన తర్వాత కళ్లు కనిపించడం లేదని వైద్యులు తెలిపారు. దీంతో చిన్నారిని భువనేశ్వర్‌ తీసుకెళ్లినా ఫలితంగా లేకపోయింది. అనంతరం వారికి 2006లో కవిత అనే మరో కుమార్తె జన్మించింది. అయితే దురదృష్టావశాత్తు ఆమె కూడా దివ్యాంగురాలే అయ్యింది. తర్వాత 2008లో మూడో కాన్పులో ఇద్దరు మగ బిడ్డలు రాకేష్‌, రాజేష్‌లు పుట్టగా, వారు కూడా దివ్యాంగులే అవ్వడంతో ఆ కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. మరోవైపు బసంతి సికిలిన్‌ అనే వ్యాధిబారిన పడడంతో ఆ కుటుంబ అల్లాడిపోయింది.

పిల్లలే ప్రాణంగా...

నలుగురు దివ్యాంగ పిల్లలను ఎంతో కష్టపడి తండ్రి రామకృష్ణ పోషిస్తున్నారు. భార్య బసంతిని చికిత్స కోసం ప్రతినెలా విశాఖపట్నం తీసుకెళ్తుంటారు. పిల్లలకు తినిపించడంతో పాటు రోజువారీ పనులు దగ్గరుండి చూసుకుంటారు. అయితే రామకృష్ణకు ప్రస్తుతం నెలకు కేవలం రూ.5 వేలు మాత్రమే జీతం వస్తోంది. పిల్లలకు గత ప్రభుత్వం దివ్యాంగ పింఛన్‌గా రూ.750 చొప్పున అందించింది. ఇప్పటి బీజేపీ ప్రభుత్వం దివ్యాంగులకు నెలకు రూ.3,500 చొప్పున పింఛన్‌ ఇస్తుండడంతో నలుగురు పిల్లలకి కలిపి రూ.14 వేలు అందుతోంది. అయితే ఈ డబ్బులు పిల్లల నెలవారీ నిత్యావసరాలు, మెడికల్‌ ఖర్చులకు సరిపోవడం లేదని రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి తనకు ఆర్థిక సాయం అందజేయాలని కోరుతున్నారు. పిల్లలకు రామకృష్ణ చేస్తున్న సేవలు మాటల్లో వర్ణించలేనివి. తండ్రి లేనిదే చిన్నారులు అన్నం తినరు, నిద్రపోరు. తండ్రి తమ ముందు ఉంటేనే వారిలో ఆనందం వికసిస్తుంది.

తన బిడ్డల తల దువ్వుతున్న రామకృష్ణ

పిల్లల సేవలో రామకృష్ణ తల్లి రాధమణి

న్యూస్‌రీల్‌

–IIలోu1
1/5

–IIలోu

–IIలోu2
2/5

–IIలోu

–IIలోu3
3/5

–IIలోu

–IIలోu4
4/5

–IIలోu

–IIలోu5
5/5

–IIలోu

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement