వైద్య రంగం ప్రైవేటీకరణతో సమాజానికి చేటు | - | Sakshi
Sakshi News home page

వైద్య రంగం ప్రైవేటీకరణతో సమాజానికి చేటు

Dec 8 2025 7:37 AM | Updated on Dec 8 2025 7:37 AM

వైద్య రంగం ప్రైవేటీకరణతో సమాజానికి చేటు

వైద్య రంగం ప్రైవేటీకరణతో సమాజానికి చేటు

● ప్రజా ఆరోగ్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. కామేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వం వైద్య ఆరోగ్య రంగానికి జీడీపీలో ఆరు శాతం నిధులను కేటాయించాలని నిపుణులు చెబుతున్నప్పటికీ పట్టించు కోకుండా.. ఆరోగ్య రంగాన్ని పీపీపీ పేరుతో ప్రైవేటీకరించే ప్రయత్నం చేయటం ప్రజలకు, సమాజానికి మంచిది కాదన్నారు. ప్రైవేటు రంగంలో వైద్య సేవలు ఎంత అందించినప్పటికీ ప్రభుత్వ రంగంలో వైద్య ఆరోగ్య సేవలు అందుబాటులో లేకపోతే మెజారిటీ ప్రజలకు అన్యాయం జరుగుతుందన్నారు. ● ప్రముఖ కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ ఏ.పూర్ణానంద్‌ మాట్లాడుతూ వైద్య వ్యవస్థలో ఉన్న లోపాలు అవగాహన రాహిత్యం వల్ల వైద్యులపై కూడా రోగులు విశ్వాసం ఉంచకుండా వైద్య విద్య అభ్యసించని వారి సలహాలను నమ్మే దుస్థితి నెలకొందన్నారు. ● ప్రముఖ పీడియాట్రిషన్‌ డాక్టర్‌ జి.సురేంద్ర మాట్లాడుతూ వ్యాధులు, వైద్యం పట్ల ప్రజలకు అవగాహన పెరగాలన్నారు. పేదలకు ఆర్థిక కారణాలతో వైద్యం అందుబాటులో లేకుండా పోతుంటే సరైన అవగాహన లేక మధ్యతరగతి వారు కూడా సరైన వైద్యం పొంద లేకపోతున్నారని తెలిపారు. ప్రజా ఆరోగ్య వేదిక జిల్లా గౌరవాధ్యక్షుడు డాక్టర్‌ మామిడి సీతారామారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి జి.విజయ్‌ప్రకాష్‌ మాట్లాడారు. సెమినార్‌లో ఆరోగ్య వేదిక నాయకులు లీల, పి.ఆర్‌.కె.రెడ్డి, రామావ తారం, జి.దుర్గ తదితరులు పాల్గొన్నారు.

ప్రజా ఆరోగ్య వేదిక ఆరోగ్య సెమినార్‌లో వక్తలు

కృష్ణలంక(విజయవాడతూర్పు): ప్రజలందరికీ ఆరోగ్యాన్ని ఇచ్చేలా వైద్య వ్యవస్థ ఉండాలని, ఐక్యూతో ఎమోషనల్‌ మేనేజ్‌మెంట్‌ కూడా ఉన్నప్పుడే కుటుంబ సంబంధాలు బలంగా ఉంటాయని ప్రజా ఆరోగ్య వేదిక ఆరోగ్య సెమినార్‌లో పలువురు వక్తలు పేర్కొన్నారు. గవర్నర్‌పేటలోని ఎం.బి.విజ్ఞాన కేంద్రంలో ప్రజా ఆరోగ్య వేదిక ఆధ్వర్యంలో జన్‌ స్వాస్థ్య అభియాన్‌ వ్యవస్థాపకుడు డాక్టర్‌ అమిత్‌ సేన్‌ గుప్తా వర్ధంతిని పురస్కరించుకుని ఎన్టీఆర్‌ జిల్లా గౌరవాధ్యక్షుడు, సీనియర్‌ వైద్యుడు డాక్టర్‌ సూరపనేని సుధాకర్‌ అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్‌లో ‘వైద్య వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లు–పరిష్కారాలు, పెరుగుతున్న మానసిక సమస్యలు–పరిష్కార మార్గాలు’ అనే అంశాలపై ఆరోగ్య సెమినార్‌ నిర్వహించారు.

ఎమోషనల్‌ మేనేజ్‌మెంట్‌ అవసరం..

ప్రముఖ మానసిక వైద్య నిపుణుడు డాక్టర్‌ ఇండ్ల రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ సమాజంలో రోజురోజుకు మానసిక సమస్యలు పెరుగుతున్నాయని, మానవ సంబంధాలు కుటుంబ సంబంధాలు దెబ్బతింటున్నాయని, ఇది ప్రమాదకరమైన సూచన అన్నారు. ఒకప్పుడు మద్యపానం, ధూమపానం ప్రధాన వ్యసనాలుగా ఉండేవని, ఇప్పుడు గంజాయి, డ్రగ్స్‌ కూడా విపరీతంగా పెరిగాయని, వాటి వల్ల యువత పెను ప్రమాదాన్ని ఎదుర్కొంటోందన్నారు. ఎమోషనల్‌ మేనేజ్‌మెంట్‌ ద్వారానే వీటన్నింటినీ అధిగమించడం సాధ్యమన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement