ఉద్యమంలా కోటి సంతకాల సేకరణ | - | Sakshi
Sakshi News home page

ఉద్యమంలా కోటి సంతకాల సేకరణ

Dec 8 2025 7:37 AM | Updated on Dec 8 2025 7:37 AM

ఉద్యమంలా కోటి సంతకాల సేకరణ

ఉద్యమంలా కోటి సంతకాల సేకరణ

ఉద్యమంలా కోటి సంతకాల సేకరణ ● మైలవరం నియోజకవర్గంలోని జి. కొండూరులో 1000 సంతకాలు సేకరించారు. కాగా ఇబ్రహీం పట్నం, కొండపల్లిలో మరో 1000 సంతకాలు సేకరించారు. ఇంకా గ్రామాల్లో సైతం సంతకాల సేకరణ కొనసాగుతోంది. ● జగ్గయ్యపేట నియోజకవర్గంలోని నందిగామ మండలం కొణతనాత్మకూరులో ఆదివారం 500 సంతకాలు సేకరించారు. ● నందిగామ నియోజకవర్గంలోని కంచికచర్లలో ఆదివారం 70 సంతకాలు సేకరించగా, వీరులపాడు మండలం జుజ్జూరులో 250 సేకరించారు. ● విజయవాడ తూర్పులో పటమట, గుణదల, లబ్బీపేట తదితర ప్రాంతాల్లో 2వేల సంతకాలు సేకరించారు. దీంతో విజయవాడ తూర్పులో లక్ష సంతకాలకు చేరువవుతోంది.

ఎన్టీఆర్‌ జిల్లాలో 4.15 లక్షలకు చేరిన సంతకాలు

లబ్బీపేట(విజయవాడతూర్పు): నూతన వైద్య కళాశాలలను పీపీపీ పేరుతో ప్రైవేటీకరణ చేయడంపై ఎన్టీఆర్‌ జిల్లాలో నిరసన సంతకాలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో లక్ష్యానికి మించి సంతకాలు సేకరణ జరగ్గా, ఇంకా ప్రజల నుంచి లభిస్తున్న స్పందనతో ఆ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. వైద్య కళాశాలలపై చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సంతకాలు చేస్తున్నారు. భావి తరాల భవిష్యత్‌ కోసం వైద్య కళాశాలలు ప్రభుత్వం ఆధీనంలోనే ఉండాలంటున్నారు. కాగా శనివారం నాటికి 4.11 లక్షల సంతకాలు సేకరించగా, ఆదివారం సెలవు దినం అయినప్పటికీ మరో 4,820 సంతకాలు సేకరించారు. ఎన్టీఆర్‌ జిల్లాలో ఇప్పటి వరకూ 4,15,820 సంతకాలు సేకరించినట్లయిది. ఆయా నియోజకవర్గాల వైఎస్సార్‌ సీపీ ఇన్‌చార్జిల నేతృత్వంలో కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతోంది.

సేకరణ ఇలా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement