
‘లజ్జబండ’ను దాటుతూ జారిపడి..
పెడన: కుమార్తెను చూడాలనే ఆతృతతో ఎప్పుడు వెళ్లే దగ్గర దారిలోనే లజ్జబండను దాటుతూ తండ్రి.. తెట్టుపై నుంచి జారి పడికనిపించకుండా పోయిన ఘటనపై పెడన పీఎస్లో ఆదివారం కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు పెడన మండలం సింగరాయపాలెం గ్రామానికి చెందిన మురాలా బాలచంద్రరావు(57) తన కుమార్తె రాజులపాటి పుష్పకుమారిని చూసేందుకు ఆదివారం మధ్యాహ్నం బయల్దేరాడు. అడ్డరోడ్డులోని లజ్జబండ డ్రెయిన్ను దాటేందుకు వీలుగా రెండు పక్కల తాడు కట్టి తెట్టుపై డ్రెయిన్ దాటే సమయంలో తెట్టుపై నుంచి జారీ డ్రెయిన్లో పడిపోయాడు. తండ్రి ఎప్పుడో వచ్చేస్తానని రాకపోవడంతో అనుమానం వచ్చి ఆమె ఆరా తీశారు. ఆయన బయల్దేరినట్లు తెలియడంతో డ్రెయిన్లో పడిపోయి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ సత్యనారాయణ కేసు నమోదు చేసి సిబ్బందితో డ్రెయిన్లో గాలింపు మొదలు పెట్టారు.
తల్లి, ముగ్గురు చిన్నారులు అదృశ్యం
గుడ్లవల్లేరు: గుడ్లవల్లేరు మండలం డోకిపర్రుకు చెందిన దేవరపల్లి జయలక్ష్మి(35) అనే మహిళ తన పిల్లలతో కలిసి రెండు రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. ఈ విషయాన్ని గుడ్లవల్లేరు ఎస్.ఐ ఎన్.వి.వి.సత్యనారాయణకు ఆమె భర్త దేవరపల్లి రాజు ఫిర్యాదు చేశారని ఆదివారం తెలిపారు. తన పిల్లలు ప్రణవి(9), విద్యశ్రీ(7), వందన(6)ను తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయిన జయలక్ష్మి ఆచూకీ ఇంతవరకు తెలియలేదన్నారు. పై ఫొటోల్లో ఉన్న వ్యక్తుల ఆచూకీ తెలిస్తే 9550593568(దేవరపల్లి రాజు) లేదా గుడ్లవల్లేరు పోలీస్స్టేషన్(9440796432)కు తెలియజేయాలని ఎస్.ఐ సత్యనారాయణ కోరారు.

‘లజ్జబండ’ను దాటుతూ జారిపడి..