
డ్రగ్స్తో యువతకు అపాయం
నార్కోటిక్స్ విభాగం ఐజీ రవికృష్ణ
లబ్బీపేట(విజయవాడతూర్పు): మాదక ద్రవ్యాలతో యువత అపాయంలో పడుతున్నారని నార్కోటిక్స్ విభాగం ఐజీ ఆర్కే రవికృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. ఇస్కాన్ విజయవాడ, ఎర్త్ హీరోస్ ఫౌండేషన్ సంయుక్తంగా ఆదివారం డ్రగ్ ఎడిక్షన్కు వ్యతిరేకంగా ర్యాలీ చేశారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంజిసర్కిల్ వరకూ వాక్థాన్ కొనసాగింది. విద్యార్థులు, యువత, వలంటీర్లు, భక్తులు, సామాజిక కార్యకర్తలు పాల్గొని సమాజానికి వ్యసన వ్యతిరేక సందేశాన్ని ఇవ్వడంలో భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా ఐజీ రవికృష్ణ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ డ్రగ్స్ వ్యసనాన్ని ఎదుర్కోవాలన్నారు. డ్రగ్స్పై టోల్ఫ్రీ నంబర్ ద్వారా సమాచారం అందించవచ్చని, వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామన్నారు. మరో అతిఽథి తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ యువత మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా ఎంతో నష్టాన్ని కలిగించే మాదక ద్రవ్యాల వలలో చిక్కుకుంటున్నారన్నారు. ఈ తరుణంలో ఇస్కాన్, ఎర్త్ హీరోస్ వంటి సంస్థలు సమాజంలో చైతన్యవంతమైన ఉద్యమాలు చేస్తూ యువతను సన్మార్గంలో నడిపించడంలో కీలకంగా నిలుస్తున్నాయన్నారు. ఇస్కాన్ విజయవాడ అధ్యక్షుడు ఏఏ చక్రధారి దాస్ మాట్లాడుతూ యువతను భక్తిమార్గం ద్వారా వ్యసనాల నుంచి విముక్తి కలిగించే మార్గం వైపు నడిపించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఈగిల్ యూనిట్ ఎస్సీ నాగేష్బాబు, ఎర్త్ హీరోస్ ఫౌండర్ హాసిని రెడ్డి, నవీన్, దుర్గాప్రసాద్, ఎర్త్హీరోస్ విజయవాడ చాప్టర్ ప్రతినిధులు భాన్సీనాయుడు, చంద్రిక తదితరులు పాల్గొన్నారు.