చైనాలో నలుగురు అమెరికన్లపై దాడి | American Citizens Brutally Stabbed in Park in China | Sakshi
Sakshi News home page

చైనాలో నలుగురు అమెరికన్లపై దాడి

Jun 11 2024 1:28 PM | Updated on Jun 11 2024 1:28 PM

American Citizens Brutally Stabbed in Park in China

చైనాలో మరో ఘాతుకం చోటుచేసుకుంది. నలుగురు అమెరికన్ అధ్యాపకులపై దాడి జరిగింది. దుండగులు అధ్యాపకులపై కత్తులతో దాడికి తెగబడ్డారు. చైనాలోని ఈశాన్య జిలిన్ ప్రావిన్స్‌లోని ఒక పార్కులో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఈ  అధ్యాపకులంతా చైనాలోని తమ భాగస్వామ్య  విశ్వవిద్యాలయాన్ని సందర్శించడానికి వెళ్లారు. ఈ ఘటన నేపధ్యంలో అయోవా కాంగ్రెస్ ప్రతినిధి మరియాన్నెట్ మిల్లర్ మీక్స్ మాట్లాడుతూ ఈ దాడిలో గాయపడిన అధ్యాపకులను తగిన వైద్య చికిత్స అందిస్తామని హామీ ఇచ్చారు.

ఈ దాడికి సంబంధించిన వివరాలను అమెరికా ప్రభుత్వ అధికారులు  వెల్లడించారు. కార్నెల్ కళాశాల అధ్యాపకులు చైనాలోని భాగస్వామ్య విశ్వవిద్యాలయాన్ని సందర్శిస్తుండగా ఈ దాడి జరిగిందని వార్తా సంస్థ సీఎన్‌ఎన్‌ తెలిపింది. కార్నెల్ కాలేజ్ ప్రెసిడెంట్ జోనాథన్ బ్రాండ్  ఈ ఘటనను ధృవీకరించారు.

మరోవైపు ఈ దాడికి సంబంధించిన నివేదికలు తమకు అందాయని, పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అధ్యాపకులు ఏ మేరకు గాయపడ్డారు? వీరిపై దాడికి కుట్ర జరిగిందా? లేక మరేదైనా కారణమా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ సంఘటనకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నామని కార్నెల్ ప్రతినిధి జెన్ వీజర్ తెలిపారు. కాగా అమెరికా పౌరులపై దాడి ఘటనను చైనా పట్టించుకోలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement