
నెట్బాల్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏకగ్రీవం
నిజామాబాద్ నాగారం: నెట్బాల్ అసోసియేషన్ జిల్లా కార్యవర్గాన్ని శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నగరంలోని వినాయక్నగర్ అభ్యాస స్కూల్లో నిర్వహించిన ఎన్నికలకు పరిశీలకులుగా కామారెడ్డి జనరల్ సెక్రెటరీ రఘురాం, నిజామాబాద్ యూత్ స్పోర్ట్స్ ఆఫీసర్ ముత్తెన్న, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య, ఎన్నికల అధికారిగా నాగేశ్వరావు వ్యవహరించారు. నూతన కార్యవర్గం 2029 వరకు కొనసాగుతుందని ఎన్నికల అధికారి ప్రకటించారు. అధ్యక్షుడిగా జీ వెంకటేశ్వర్ రావు, ప్రధాన కార్యదర్శిగా ఏ రమేశ్, కోశాధికారిగా పీ గంగాధర్, చైర్మన్గా రవీందర్, వైస్ ప్రెసిడెంట్లుగా సీహెచ్ అన్నపూర్ణ, నాగేశ్, రమేశ్, జాయింట్ సెక్రెటరీలుగా నాగరాజు, కృష్ణంరాజు, ఆశాజ్యోతి, అనిల్కుమార్, ఈసీ మెంబర్లుగా కుమార్, ప్రవీణ్, రాజు, సాగర్ , అప్పారావు , మధుకర్, ప్రసన్న ఎన్నికయ్యారు. అనంతరం నూతన అధ్యక్షుడు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రస్తుతం నెట్బాల్ పోటీల్లో క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబర్చేలా ప్రోత్సహిస్తామన్నారు.