
జీపీఎస్ ట్రాకర్తో వాహనం సేఫ్
ఖలీల్వాడి: రూ. లక్షలు పెట్టి కొనుగోలు చేసిన వాహనం చోరీకి గురైతే ఎవరికై నా బాధగా ఉంటుంది. అదే వాహన కొనుగోలు సమయంలో కొంత ఖర్చుపెట్టి జీపీఎస్ ట్రాకర్ను బిగిస్తే వాహనానికి భద్రత ఉంటుంది. ఇటీవల బైక్లకు జీపీఎస్ ట్రాకర్లు బిగించుకునేందుకు యజమానులు ఆసక్తి చూపుతున్నారు. వాహన జీపీఎస్ ట్రాకర్ వాడకంతో హైదరాబాద్ వంటి ప్రధాన నగరంలో వాహనాల చోరీల సంఖ్య గణనీయంగా తగ్గినట్లు తెలుస్తోంది.
జీపీఎస్ పని చేసేది ఇలా..
జీపీఎస్(గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్) ట్రాకర్ శాటిలైట్ సిగ్నల్స్ ద్వారా అక్షాంశ, రేఖాంశాల ఆధారంగా వాహనం కచ్చితమైన స్థానాన్ని గుర్తిస్తుంది. మొబైల్ యాప్, వెబ్ ప్లాట్ఫాం ద్వారా వినియోగదారుడికి సమాచారం చేరుతుంది. వాహనంలో బయటికి కనిపించని ప్రాంతాల్లో జీపీఎస్ను బిగించి బ్యాటరీకి అనుసంధానం చేస్తారు. మరికొన్ని స్వ తంత్ర బ్యాటరీతో పనిచేస్తాయి. కంపెనీలు జీపీఎస్ ట్రాకర్లను అమర్చేందుకు రూ. 1500 నుంచి రూ. 5 వేల వరకు వసూలు చేస్తున్నాయి. ఇందులో ఉండే సిమ్ కార్డును రీఛార్జి చేసుకోవాల్సి ఉంటుంది.
ఉపయోగాలివి..
రియల్ టైమ్ ట్రాకింగ్: జీపీఎస్ బిగించిన వాహనం చోరీకి గురైతే కచ్చితమైన స్థానాన్ని చూపిస్తుంది. పార్క్ చేసిన ప్రాంతం నుంచి కదిలిస్తే సెల్ఫోన్కు (మెసేజ్) హెచ్చరిక వెళుతుంది. మరికొన్ని ట్రాకర్లలో ఉన్న చోటి నుంచే వాహన ఇంజిన్ను ఆపేయవచ్చు.
రికవరీ వేగవంతం: బైక్ను ఎత్తుకెళ్లితే వారు ఎక్కడికి తీసుకువెళ్లారో స్పష్టంగా తెలియడంతోపాటు జీపీఎస్ సాయంతో పోలీసులు వాహనాన్ని త్వరగా గుర్తించి స్వాధీనం చేసుకునే అవకాశం ఉంటుంది.
చోరీ చేస్తే సులభంగా గుర్తించే వీలు
పరికరం బిగించుకునేందుకు ఆసక్తి చూపుతున్న వాహనదారులు
స్టేషన్లో ఫిర్యాదు చేయాలి
వాహనాలు చోరీకి గురైతే వెంటనే స్థానిక పీఎస్లో ఫిర్యాదు చేయాలి. వాహన తనిఖీల్లో దొరికే అవకాశం ఉంటుంది. వాహనంపై ఏ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయినదో స్పష్టంగా తెలుస్తుంది. వాహనాల తనిఖీల్లో జీపీఎస్తో ఉన్న బైక్ దొరికితే అసలు యజమానిని సులభంగా తెలుసుకోవచ్చు.
– ప్రసాద్, ట్రాఫిక్ సీఐ, నిజామాబాద్