చోరీ కేసులో ఒకరి అరెస్టు | - | Sakshi
Sakshi News home page

చోరీ కేసులో ఒకరి అరెస్టు

Jun 15 2025 9:12 AM | Updated on Jun 15 2025 9:12 AM

చోరీ కేసులో ఒకరి అరెస్టు

చోరీ కేసులో ఒకరి అరెస్టు

ఎల్లారెడ్డి: పట్టణంలోని సత్యం కిరాణా దుకాణంలో చోరీకి పాల్పడిన వ్యక్తిని పట్టుకొని అరెస్టు చేసినట్లు ఎస్సై మహేశ్‌ శనివారం తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. మండలంలోని భిక్కనూర్‌ గ్రామానికి చెందిన కోడేనోళ్ల రాజు ఈ నెల 11న రాత్రి సత్యంకు చెందిన కిరాణా దుకాణంలో చోరీకి పాల్పడ్డాడు. శనివారం ఎల్లారెడ్డిలో వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా పోలీసులను చూసి పారిపోతున్న రాజును పట్టుకొని విచారించగా కిరాణా దుకాణంలో చోరీకి పాల్పడినట్లు ఒప్పుకున్నట్లు తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై తెలిపారు.

కంటైనర్‌, టీవీఎస్‌ ఎక్సెల్‌ ఢీ

ఇద్దరికి గాయాలు

నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): నాగిరెడ్డిపేట మండల కేంద్రం గోపాల్‌పేటలో జాతీయ రహదారిపై కంటైనర్‌, టీవీఎస్‌ ఎక్సెల్‌ ఢీకొని ఇద్దరు గాయపడిన ఘటన శనివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం... లింగంపేట మండలం శెట్పల్లి సంగారెడ్డికి చెందిన ఒడ్డె గాలయ్య, సిద్ధవ్వ టీవీఎస్‌ ఎక్సెల్‌పై గోపాల్‌పేటలోని జాతీయ రహదారిపై ప్రయాణిస్తుండగా మెదక్‌ నుంచి ఎల్లారెడ్డి వైపు వెళ్తున్న కంటైనర్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గాలయ్య, సిద్ధవ్వ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో 108 అంబులెన్స్‌ సిబ్బంది క్షతగాత్రులను చికిత్స నిమిత్తం మెదక్‌ ఏరియా ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement