
చెరువులో పడి మత్స ్యకారుడి మృతి
బీబీపేట: చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి మత్స్యకారుడు మృతి చెందిన ఘటన శనివారం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్సై ప్రభాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గుర్రం లక్ష్మణ్ (35) శుక్రవారం స్థానిక పెద్ద చెరువులో చేపలవేటకు వెళ్లాడు. తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతికినా ఆచూకీ లభించలేదు. శనివారం ఉదయం చెరువు వద్దకు వెళ్లి చూడగా లక్ష్మణ్ మృతదేహం కనిపించింది. మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య మంజుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి ఒక కూతురు, కుమారుడు ఉన్నారు.
కేజ్వీల్ ట్రాక్టర్ ఢీకొని ఒకరు..
బోధన్రూరల్: మండలంలోని సంగం గ్రామంలో నాయకం ఎర్ర సాయిలు (48) కేజ్వీల్ ట్రాక్టర్ ఢీకొని అక్కడిక్కడే మృతి చెందినట్లు బోధన్ రూరల్ ఎస్సై మచ్చేందర్ రెడ్డి తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం నాయకం ఎర్ర సాయిలు గ్రామంలోని చౌరస్తా వద్ద గల హోటల్లో టీ తాగి నడుచుకుంటూ వెళుతున్నాడు. అదే సమయంలో గ్రామానికి చెందిన సూర శ్రీనివాస్ కేజ్వీల్ ట్రాక్టర్ను అతివేగంగా, అజాగ్రత్తగా నడుపుతూ సాయిలును ఢీకొట్టాడు. దీంతో దమ్ము చక్రాల కింద పడిపోవడంతో సాయిలు తలకు బలమైన గాయాలై అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు శనివారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మచ్చేందర్ రెడ్డి పేర్కొన్నారు.