
వారణాసి: రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ కుమారుడు, బీహార్ మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ మరోమారు వార్తల్లో నిలిచారు. వారణాసిలోని విశ్వనాథుని ఆలయంలోని నిషేధిత ‘రెడ్ జోన్’ లోపలికి తేజ్ ప్రతాప్ యాదవ్ ప్రవేశించడం కలకలం రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కాశీ విశ్వనాథ ఆలయ పరిపాలన అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ హై-సెక్యూరిటీ జోన్లో కాశీ విశ్వనాథ్ కారిడార్లోని గర్భగుడి ప్రాంగణం కూడా ఉంది. ఇక్కడికి అనధికారిక ప్రవేశాన్ని నిషేధించారు. అయితే తేజ్ ప్రతాప్ యాదవ్ ఈ జోన్లలో తిరుగాడుతున్నట్లు ఉన్న వీడియో గురువారం సోషల్ మీడియాలో కనిపించింది.
बाबा विश्वनाथ का आशीर्वाद हो,
माँ गंगा का निर्मल पवित्र घाट हो,
पूरी दुनिया को मैं भूल जाऊं और
बनारस में मेरा भोला मुझे याद हो हर हर महादेव बोलना ही होगा। ...#Varanasi pic.twitter.com/Uq5tS32evB— Tej Pratap Yadav (@TejYadav14) June 13, 2025
దీనిపై కాశీ విశ్వనాథ ఆలయ సీఈవో విశ్వ భూషణ్ మిశ్రా మాట్లాడుతూ ఆన్లైన్లో కనిపించిన ఈ వీడియోను ఆలయ అధికారులు గమనించారని అన్నారు. వారు దీనిని కేంద్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్)తో స్థానిక పోలీసులకు తెలియజేశారన్నారు. వారు సమగ్ర దర్యాప్తు నిర్వహించి చర్యలు తీసుకుంటారని తెలిపారు. ఇటీవలి కాలంలో తేజ్ ప్రతాప్ మరిన్ని చిక్కుల్లో పడ్డారు. మే 25న అతని తండ్రి లాలూ ప్రసాద్ అతన్ని రాష్ట్రీయ జనతాదళ్ నుండి బహిష్కరించారు. అతనికి తమ కుటుంబంతో ఎటువంటి సంబంధం లేదని కూడా ప్రకటించారు. ఈ విషయాన్ని తేజ్ ప్రతాప్ సోషల్ మీడియాలో తెలియజేశారు. మరోవైపు తేజ్ ప్రతాప్ విడాకులపై కోర్టులో విచారణ కొనసాగుతోంది. అలాగే తేజ్ ప్రతాప్ 12 ఏళ్లుగా ఒక మహిళతో సంబంధంలో ఉన్నారనే వార్తలు వినిపించాయి.
#WATCH | Ghaziabad, UP | On Tej Pratap Yadav's viral reel from the Kashi Vishwanath Temple premises, CEO of Kashi Vishwanath Temple, Vishwa Bhushan Mishra, says, "The area inside the temple is a restricted area. One cannot take a mobile phone or a camera there. However, we… pic.twitter.com/qatUGV0NDL
— ANI (@ANI) June 14, 2025
ఇది కూడా చదవండి: Air India Plane Crashed: 31 మృతదేహాల నిర్థారణ.. డీఎన్ఏ పరీక్షలు ముమ్మరం