ప్రధాని మోదీ చైనా పర్యటన ఖరారు | PM Narendra Modi Visit To China Finalized For SCO Summit In Qingdao | Sakshi
Sakshi News home page

ప్రధాని మోదీ చైనా పర్యటన ఖరారు

Aug 6 2025 4:46 PM | Updated on Aug 6 2025 5:12 PM

Pm Narendra Modi Visit To China Finalized

ఢిల్లీ: ప్రధాని మోదీ చైనా పర్యటన ఖరారైంది. ఈ నెల 31 నుంచి సెప్టెంబర్‌ 1 వరకు ప్రధాని చైనాలో పర్యటించనున్నారు. ట్రంప్‌ టారిఫ్‌ల నేపథ్యంలో మోదీ చైనా పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. తియాంజిన్‌ నగరంలో జరిగే షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ) సదస్సుకు మోదీ హాజరుకానున్నారు.

కాగా, 2020 జూన్‌లో జరిగిన భారత్, చైనా జవాన్ల భీకర ఘర్షణ తర్వాత మోదీ చైనాకు వెళ్తుండడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఆయన చివరిసారిగా 2019లో చైనాలో పర్యటించారు. గల్వాన్‌ లోయ ఘటన తర్వాత భారత్‌–చైనా ద్వైపాక్షిక సంబంధాలు క్షీణించాయి. సంబంధాలు పునరుద్ధరించుకోవాలని ఇరుదేశాలు భావిస్తున్నాయి. ఈ విషయంలో మోదీ చైనా పర్యటన కీలకమైన ముందడుగు అవుతుందని దౌత్య నిపుణులు అంచనా వేస్తున్నారు.

మోదీ చైనా పర్యటన సందర్భంగా చైనా అధినేత షీ జిన్‌పింగ్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశం ఉంది. మోదీ ప్రధానమంత్రి హోదాలో ఇప్పటిదాకా ఐదు సార్లు చైనాలో పర్యటించారు. దేశ విదేశాల్లో షీ జిన్‌పింగ్‌తో 18 సార్లు సమావేశమయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement