రైలులో అగ్ని ప్రమాదం.. ప్రయాణికులకు గాయాలు | Moving Train Catches Fire In Haryana, Many People Got Minor Injuries | Sakshi
Sakshi News home page

రైలులో అగ్ని ప్రమాదం.. ప్రయాణికులకు గాయాలు

Oct 29 2024 8:22 AM | Updated on Oct 29 2024 9:27 AM

Moving Train Catches Fire In Haryana

చండీగఢ్‌:హర్యానాలోని రోహ్‌తక్‌లో కదులుతున్న రైలులో బాణసంచాకు మంటలంటుకున్నాయి.ఈ ప్రమాదంలో రైలులో ప్రయాణిస్తున్న పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. జింద్‌ నుంచి ఢిల్లీ వెళుతున్న రైలులో తొలుత మంటలు లేచాయని, తర్వాత రైలు మొత్తం పొగచూరిందని జీఆర్పీ పోలీసులు తెలిపారు.

రైలులో షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా తొలుత మంటలు లేచాయని, ఈ మంటలు రైలులో ఉన్న ఓ ప్రయాణికుడి వద్ద ఉన్న బాణసంచాకు అంటుకోవడంతో అగ్ని ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా తేల్చారు. పోలీసులు కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.   

ఇదీ చదవండి: గుడిలో బాణసంచా ప్రమాదం.. 150 మందికి గాయాలు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement