కోల్కతా: పశ్చిమ బెంగాల్లో ప్రధాని మోదీ 26వ విడత పీఎం–కిసాన్ నిధులను విడుదల చేశారు. శనివారం హూగ్లీ జిల్లా తారకేశ్వర్ పర్యటనలో ఉన్న మోదీ బటన్ నొక్కి రైతులకు డబ్బులు రిలీజ్ చేశారు. దీంతో దేశవ్యాప్తంగా అన్నదాతలకు పీఎం కిసాన్కు సంబంధించిన రూ. 2 వేలు అకౌంట్లలో జమయ్యాయి. ఈ పథకం ద్వారా మెుత్తంగా 9.44 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి రూ.18,880 కోట్లు జమయ్యాయి.
2019లో ఈ పథకం ప్రారంభం కాగా ఇప్పటివరకు మొత్తం రూ.4.46 లక్షల కోట్లను రైతులకు సాగు సాయంగా విడుదల చేసినట్లు కేంద్రం తెలిపింది. ఏటా మూడు విడతలలో ఈ డబ్బును అందజేస్తుంది. పీఎం కిసాన్ ద్వారా ఒక్కో రైతుకు మెుత్తం రూ.6 వేల చొప్పున పెట్టుబడి సాయం అందుతుంది.


