
న్యూఢిల్లీ: భారతదేశపు అత్యంత దూరం ప్రయాణించే తొలి వందే భారత్ రైలును ప్రధాని మోదీ మహారాష్ట్రలో ప్రారంభించనున్నారు. ఈ వందే భారత్ రైలు మొత్తం 881 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తుంది. ఈ రైలుకు మొత్తం 10 స్టాప్లు ఉంటాయి. సగటున 73 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది.
నాగ్పూర్లోని అజ్ని- పూణే మధ్య దీర్ఘ దూరం నడిచే వందే భారత్ రైలు మహారాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఇది రాష్ట్రంలోని 12వ వందే భారత్ రైలుగా నిలవనుంది. ఆగస్టు 10న ప్రధాని నరేంద్ర మోదీ ఈ రైలును ప్రారంభించనున్నారు. రైలు నంబర్లు 26101/26102. ఆగస్టు 11 నుండి పూణే స్టేషన్ నుండి, ఆగస్టు 12 నుండి అజ్ని స్టేషన్ నుండి తన సాధారణ సేవలను ప్రారంభించనుంది. ఈ రైలు వారానికి ఆరు రోజులు రాకపోకలు సాగించనుంది.
మహారాష్ట్రలోని ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, విద్యార్థులు,సాధారణ ప్రయాణాలు సాగించేవారికి ఈ రైలు ప్రయోజనకరంగా ఉండనుంది. ఈ రైలు వార్ధా, బద్నేరా, అకోలా, షెగావ్, భూసావల్, జల్గావ్, మన్మాడ్, కోపర్గావ్, అహ్మద్ నగర్ , దౌండ్ కార్డ్ స్టేషన్లలో ఆగనుంది. ఎనిమిది కోచ్లతో.. ఒక ఎగ్జిక్యూటివ్ చైర్ కార్, ఏడు స్టాండర్డ్ చైర్ కార్లు, మొత్తం 590 మంది ప్రయాణీకులకు కూర్చునేందుకు ఈ రైలు అవకాశం కల్పిస్తుంది.