సహజీవనం నైతికంగా ఆమోదయోగ్యం కాదు: హైకోర్టు

Live In Relationships Morally Socially Unacceptable Punjab High Court - Sakshi

సంచలన వ్యాఖ్యలు చేసిన పంజాబ్‌ హైకోర్టు

చండీగఢ్‌: లివ్‌ ఇన్‌ రిలేన్‌షిప్‌(సహజీవనం)పై పంజాబ్‌, హరియాణా హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ బంధం సామాజికంగా, నైతికంగా ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. ఇంటి నుంచి పారిపోయిన ఓ జంట తమకు రక్షణ కల్పించాల్సిందిగా కోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌ విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

పిటిషినర్లు గుల్జా కుమారి(19), గురువిందర్‌ సింగ్‌(22) తార్న్ తరన్ జిల్లాకు చెందిన వారు. ఈ క్రమంలో వారు తాము కలిసి నివసిస్తున్నామని.. త్వరలోనే వివాహం చేసుకోబోతున్నామని తెలిపారు. గుల్జా కుమారి తల్లిదండ్రుల వల్ల తమకు ప్రాణహాని ఉందని.. రక్షణ కల్సించాల్సిందిగా కోరుతూ.. కోర్టును ఆశ్రయించారు.  

ఈ సందర్భంగా కోర్టు.. ‘‘వాస్తవానికి పిటిషినర్లు దాఖలు చేసిన పిటిషన్‌ ద్వారా తమ లివ్‌ ఇన్‌ రిలేషన్‌కు ఆమోద ముద్ర కోరుతున్నారు. కానీ సహజీవనం నైతికంగా, సామాజికంగా ఆమోదయోగ్యం కాదు’’ అని జస్టిస్‌ హెచ్‌ఎస్‌ మదాన్‌ తన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. 

చదవండి: ‘‘టీకాలు లేనప్పుడు విసిగించే ఆ కాలర్‌ ట్యూన్‌ ఎందుకు?’’

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top