బీజేపీ ప్లాన్‌ సక్సెస్‌.. గోవాలో కాంగ్రెస్‌ ఖాళీ! | Goa Congress Eight MLAs Join In BJP | Sakshi
Sakshi News home page

బీజేపీ ప్లాన్‌ సక్సెస్‌.. గోవాలో కాంగ్రెస్‌ ఖాళీ!

Sep 14 2022 1:12 PM | Updated on Sep 14 2022 4:13 PM

Goa Congress Eight MLAs Join In BJP - Sakshi

గోవాలో రాజకీయం ఒక్కసారిగా ఊహించని ములుపు తిరిగింది. ప్రతిపక్షంలో ఉన్న 8 మంది కాంగ్రెస్‌ నేతలు బీజేపీలో చేరారు. కాగా, బీజేపీలో చేరిన వారీలో మాజీ ముఖ్యమంత్రి దిగంబర్‌ కామత్‌ కూడా ఉండటం విశేషం. 

కాగా, ఎనిమిది మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు సీఎం ప్రమోద్‌ సావంత్‌ సమక్షంలో బుధవారం బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా వారి రాజీనామా లేఖలను స్పీకర్‌కు అందజేశారు. దీంతో, కాంగ్రెస్‌ శాసనసభాపక్షం బీజేపీలో విలీనమైంది. కాగా, ఇది కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు కాంగ్రెస్‌పై సెటైరికల్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌ మాట్లాడుతూ.. దేశంలో కాంగ్రెస్‌ జోడో యాత్ర కాదు.. కాంగ్రెస్‌ చోడో యాత్ర కొనసాగుతోందంటూ ఎద్దేవా చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement