ఎన్నికల అబ్జర్వర్లకు ఈసీ మార్గనిర్దేశం | EC Guidelines To Election Observers In Delhi | Sakshi
Sakshi News home page

ఎన్నికల అబ్జర్వర్లకు ఈసీ మార్గనిర్దేశం

Mar 11 2024 4:16 PM | Updated on Mar 11 2024 4:21 PM

EC Guidelines To Election Observers In Delhi - Sakshi

ఢిల్లీ: ఎన్నికల పరిశీలకులతో కేంద్ర ఎన్నికల సంఘం సమావేశం అయింది. రానున్న ఎన్నికల్లో పరిశీలకులు వ్యవహరించాల్సిన తీరుపై మార్గనిర్దేశం చేసింది. ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరిగేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఫిర్యాదులు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని పేర్కొంది.

ఎన్నికల పరిశీలకుల ఫోన్ నెంబర్లు, ఇమెయిల్ విస్తృతంగా ప్రచారం చేయాలని తెలిపింది. తమకు కేటాయించిన పార్లమెంటు పరిధిలోనే తిరగాలని అధికారులకు సూచించింది. వీలైనన్ని ఎక్కువ పోలింగ్ కేంద్రాలు సందర్శించి సమస్యలు పరిష్కరించాలని అధికారులకు తెలిపింది.

చదవండి: ECI: 15 నాటికి ఇద్దరు కొత్త ఎలక్షన్‌ కమిషనర్లు!

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement