
సాక్షి, ఢిల్లీ: కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. కిషన్రెడ్డి శాస్త్రీభవన్లోని తన చాంజర్లో బాధ్యతలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు.
ఇక, లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి కిషన్ రెడ్డి రెండోసారి విజయం సాధించిన విషయం తెలిసిందే. 2019లో కిషన్ రెడ్డి హోంశాఖ సహాయమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.

మరోవైపు, నేడు బీజేపీ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కూడా హోంశాఖ సహాయమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. పదవీ బాధ్యతల కార్యక్రమానికి హాజరై బండి సంజయ్కు జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య భారతి స్వామీజీ ఆశీస్సులు అందించారు. భద్రతా కారణాల రీత్యా కార్యకర్తల అట్టహాసం, నాయకుల సందడి లేకుండా ఒంటరిగానే బండి సంజయ్ ఛార్జ్ తీసుకున్నారు.

#WATCH | Bandi Sanjay takes charge as the Minister of State for Home in the North Block office of the Ministry of Home Affairs. pic.twitter.com/pdoM4O9k3V
— ANI (@ANI) June 13, 2024