మక్తల్: కొడంగల్–నారాయణపేట–మక్తల్ ఎత్తిపోతల పథకం పనులు కమీషన్ల కోసమే చేపడుతున్నారని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి ఆరోపించారు. గురువారం మండలంలోని భూత్పూర్ రిజర్వాయర్ వద్ద రెగ్యులేటరీ నిర్మాణ పనులను ఆయన పరిశీలించి మాట్లాడారు. ఈ ప్రాంతంలో కొత్తగా రెగ్యులేటరీ నిర్మాణం అవసరం లేదని.. అసవసరంగా కమీషన్ల కోసం నిర్మాణం చేపడుతున్నారన్నారు. ఒక టీఎంసీ సామర్థ్యం ఉన్న భూత్పూర్ రిజర్వాయర్ నుంచి కొడంగల్కు ఏ విధంగా ఏడు టీఎంసీల నీటిని తరలిస్తారని ప్రశ్నించారు. అవగాహన లేకుండా పనులు చేపడుతున్నారని.. ఇలాగే కొనసాగితే హీమా ప్రాజెక్టు కింద ఉన్న సంగంబండ, భీమా ప్రాజెక్టుకు నీళ్లు చేరవన్నారు. భీమా ప్రాజెక్టు కింద 5 మండలాల భూములుకు పూర్తిగా సాగునీరు అందక ఎడారిగా మారుతాయని తెలిపారు. పాలమూరు ఎత్తిపోతల పథకం నుంచి కొడంగల్కు నీళ్లు సులభంగా తీసుకెళ్లే అవకాశం ఉందని తెలిపారు. ఆయన వెంట మాజీ మార్కెట్ చైర్మన్ నర్సింహగౌడ్, ఈశ్వర్ తదితరులు ఉన్నారు.


