
కథకు పుట్టినిల్లు నల్లగొండ
రామగిరి(నల్గొండ): ఆధునిక తెలుగు కథకు నల్లగొండ పుట్టినిల్లు అని సాహితీవేత్త డాక్టర్ సుంకిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. ఆదివారం కథా రచయిత డాక్టర్ సాగర్ల సత్తయ్య రచించిన ‘బర్కతి’ కథా సంపుటిని నల్లగొండలోని యూటీఎఫ్ భవన్లో ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. నల్లగొండ కథా పాఠశాల పేరుతో ఇటీవల నల్లగొండలో నూతన కథకులు చక్కని కథలు రాస్తుండడం అభినందనీయం అన్నారు. పెరుమాళ్ల ఆనంద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సాహితీవేత్త డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, మేరెడ్డి యాదగిరిరెడ్డి , మునాస్ వెంకట్, తండు కృష్ణ కౌండిన్య, పగడాల నాగేందర్, బైరెడ్డి కృష్ణారెడ్డి, ఎలికట్టె శంకర్రావు, మేక నాగయ్య, ఎడ్ల సైదులు, శీలం భద్రయ్య, బండారు శంకర్, ముక్కామల జానకిరామ్, డాక్టర్ మెంతబోయిన సైదులు, కాసుల ఆంజనేయులు, కుకుడాల గోవర్ధన్, కోమటిరెడ్డి రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.