
ఆటోలో దివ్యాంగులకు ఉచిత ప్రయాణం
మిర్యాలగూడ టౌన్: మిర్యాలగూడ మండలం వెంకటాద్రిపాలెం గ్రామ పరిధిలోని కొత్తూరు(బొద్దుగుట్ట)కు చెందిన అందుగుల సైదులు మూడు నెలల క్రితం కొత్త ఆటో కొన్నాడు. తన ఆటోలో దివ్యాంగులకు ఉచితంగా వారి గమ్యస్థానాలకు చేరవేస్తున్నాడు. గతంలో పాత ఆటో నడిపే సమయంలో ఓ దివ్యాంగుడు రోడ్డుపై ఎండలో నిలబడగా, అతడిని వద్దకు వెళ్లి ఎక్కడికి వెళ్లాలని అడగానని.. దానికి అతడు తన వద్ద డబ్బులు లేవు అని చెప్పడంతో ఎంతో బాధ అనిపించిందని సైదులు పేర్కొన్నాడు. దీంతో అప్పటి నుంచి దివ్యాంగులజీ తన ఆటోలో వారిని గమ్యస్థానాలకు ఉచితంగానే చేరవేస్తున్నట్లు సైదులు తెలిపాడు.