
కాంగ్రెస్ బలోపేతానికి కృషిచేయాలి
ఫ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు
నల్లగొండ: కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కార్యకర్తలంతా సమష్టిగా కృషిచేయాలని ఆ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు అన్నారు. శనివారం నల్లగొండ పట్టణంలోని మంత్రి కోమటిరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మహిళా కాంగ్రెస్ సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు వస్తుందన్నారు. ఈ సందర్భంగా వివిధ పదవుల్లో నియమించిన వారికి నియామక పత్రాలు అందజేశారు. అనంతరం రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రంలో భాగంగా దేవరకొండ రోడ్డులో ఉన్న డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పట్టణంలోని లైన్వాడ కాలనీలో గల కాంగ్రెస్ కార్యకర్త ఇంట్లో సన్న బియ్యంతో వండిన భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గోపగాని మాధవి, నాయకురాళ్లు దుబ్బ రూప, నాగమణి, జాన్, సుజాత, రాజ్యలక్ష్మి, సురెడ్డి సరస్వతి పాల్గొన్నారు.

కాంగ్రెస్ బలోపేతానికి కృషిచేయాలి