
ఎంజీ యూనివర్సిటీలో రక్తదాన శిబిరం
నల్లగొండ టూటౌన్ : ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా శుక్రవారం పట్టణ పరిధిలోని ఎంజీ యూనివర్సిటీలో రక్తదాన శిబిరరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంజీయూ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ పాల్గొని రక్తదానం ప్రాముఖ్యత గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. రక్త దానం చేయండి.. మనిషి ప్రాణాలను నిలబెట్టండని సూచించారు. అనంతరం పలువురు ఎన్ఎస్ఎస్ విద్యార్థులు రక్తదానం చేశారు. కార్యక్రమంలో సైన్స్ కళాశాల ఎన్ఎస్ఎస్ చైర్మన్ డాక్టర్ ప్రేమ్సాగర్, బి.వీరస్వామి, జి.సుధాకర్, అల్వాల రవి, మద్దిలేటి పసుపుల, రూప, తిరుమల, సత్తిరెడ్డి, ఆంజనేయులు, మాధురి తదితరులు పాల్గొన్నారు.